నా రాజకీయ జీవితం టిడిపితోనే: ఎర్రబెల్లి, కెసిఆర్పై ఫైర్
బయ్యారం విషయంలో కెసిఆర్పై ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వర రావు కెసిఆర్పై తీవ్రంగా మండిపడ్డారు. రక్షణ స్టీల్స్ను రక్షించింది కెసిఆరేనని వారు ఆరోపించారు. గనులపై పార్లమెంటులో చర్చ జరగుతుంటే కెసిఆర్ ఎందుకు రాలేదని వారు అడిగారు. కెసిఆర్కు ఎంపి పదవి కావాలి గానీ పార్లమెంటుకు హాజరు కారని వారు వ్యాఖ్యానించారు. కెసిఆర్ వల్లనే తెలంగాణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. బయ్యారంపై కెసిఆర్తో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు.
బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలన్నది తమ పార్టీ డిమాండ్ అని వారన్నారు. బయ్యారం అంశంపై అఖిల పక్ష సమావేశం పెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బయ్యారంపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేసే వరకు తాము పోరాటం సాగిస్తామని వారు చెప్పారు. బయ్యారం వ్యవహారంపై ఈ నెల 17వ తేదీన గవర్నర్ను కలుస్తామని వారు చెప్పారు.
తమ పార్టీ పోరాటం వల్లనే వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి బయ్యారం గనుల కేటాయింపు రద్దయిందని వారు చెప్పుకున్నారు. విశాఖ స్టీల్స్కు, రక్షణ స్టీల్స్కు పనికి వచ్చే ముడి ఇనుము ఉక్కు కర్మాగారం పెట్టడానికి పనికి రాదా అని వారు అడిగారు. బయ్యారంపై ఉద్యమిస్తోందని తమ పార్టీ మాత్రమేనని వారన్నారు.