శ్రీశాంత్ కంటతడి, నేరాన్ని అంగీకరించాడు: పోలీసులు

S Sreesanth
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్)వలో తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు భారత క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు శ్రీశాంత్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. విచారణ సందర్భంగా శ్రీశాంత్ కంటతడి పెట్టాడని, స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకరున్నాడని ఢిల్లీ పోలీసు అధికారి చెప్పారు.

రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్‌లో తన పాత్రను పోలీసుల విచారణలో ఇది వరకే అంగీకరించాడు. మూడో క్రికెటర్ అజిత్ చండిలా తనపై వచ్చిన ఆరోపణలను ఇంకా అంగీకరించలేదు. ఆ ముగ్గురిని పోలీసులు గురువారం ముంబై నుంచి ఢిల్లీకి తరలించి కోర్టులో ప్రవేశపెట్టారు వారిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది.

శుక్రవారం ముగ్గురు క్రికెటర్లను పోలీసులు విచారించారు. ఆ ముగ్గురు క్రికెటర్లతో పాటు పోలీసులు 11 మంది బుక్కీలను అరెస్టు చేశారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం ఐపియల్‌ను కుదిపేసింది. శ్రీశాంత్ అమాయకుడని అతని తరఫు న్యాయవాది దీపక్ ప్రకాష్ చెప్పిన విషయం తెలిసిందే. శ్రీశాంత్ తొలుత తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించలేదు.

కాగా, ఐపియల్‌లో ఫిక్సింగ్ వార్తలు చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు ఐపియల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ అన్నారు. ఢిల్లీ పోలీసులు చెప్పేంత వరకు ఫిక్సింగ్ జరుగుతోందని బిసిసిఐ, ఐసిసి యాంటీ కరప్షన్ యూనిట్ తెలుసుకోలేకపోవడం దారుణమని ఆయన అన్నారు. ఇప్పటికే ఐపియల్ చూసేవాళ్ల సంఖ్య తగ్గిపోయిందని, ఈ సంఘటనతో మరింత మంది అభిమానులు లీగ్‌కు దూరమవుతారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+