శ్రీశాంత్ నో బాల్ వేస్ట్: జిజూ జనార్ధన్తో సంభాషణ
శ్రీశాంత్ తన నడుంకు టవల్ పెట్టుకుని తాను 14 పరుగులు ఇచ్చే ఓవరు వేయబోతున్నట్లు బుక్కీలకు సంకేతాలు ఇచ్చాడని అంటున్నారు. శ్రీశాంత్ షాన్ మార్ష్కు బౌలింగ్ చేశాడు. మొదటి బంతికి పరుగులు రాలేదు. రెండో బంతిని మార్ష్ ఫోర్గా మలిచాడు. మూడో బంతికి పరుగులు రాలేదు. నాలుగో బంతికి ఒక్క పరుగు ఇచ్చాడు. ఐదో బంతికి నాలుగు పరుగులు ఇచ్చాడు. దీంతో అప్పటికి శ్రీశాంత్ 9 పరుగులు ఇచ్చాడు.
చివరి బంతికి నాలుగు పరుగులు ఇచ్చాడు. దాంతో ఓవరులో శ్రీశాంత్ 13 పరుగులు ఇచ్చాడు. అయితే, ఒక్క పరుగు తక్కువ పడింది. మరో పరుగు ఇవ్వడానికి శ్రీశాంత్ చివరి బంతిని నో బాల్ చేశాడట. అయితే, దాన్ని అంపైర్ గుర్తించలేదు. దాంతో నో బాల్గా ప్రకటించలేదు. దాంతో ఆందోళనకు గురైన శ్రీశాంత్ బుక్కీ జిజూ జనార్దన్తో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఓవరును పూర్తిగా పరిశీలించడానికి పోలీసులు బిసిసిఐని ఫుటేజ్ అడిగినట్లు సమాచారం.
ఫోన్ సంభాషణలు శ్రీశాంత్, జిజూ జనార్దన్వేనా, కావా అనే విషయాన్ని తేల్చుకోవడానికి వాయిస్ టెస్టుకు పంపించారు. నివేదిక కోసం పోలీసులు నిరీక్షిస్తున్నారు.