విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అఫైర్ అనుమానంతో భార్యను హత్య చేసిన వ్యక్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Women
విజయవాడ: అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. ఈ సంఘటన విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో మంగళవారం జరిగింది. భార్యను హత్య చేయడానికి పెళ్లి రోజునే అతను ఎంచుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

కె. దుర్గారావు అనే ఆటో డ్రైవర్ నాగ లక్ష్మిని ప్రేమించి, మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెద్దలను వ్యతిరేకించి వారిద్దరు వివాహం చేసుకున్నారు. 18 నెలల క్రితం వారికి ఓ కుమారుడు పుట్టాడు. పుత్రుడు జన్మించినప్పటి నుంచి భార్యపై అతనికి అనుమానం పెరుగుతూ వచ్చింది. దాంతో తాగివచ్చి ఆమెను తరుచుగా కొడుతుండేవాడు.

సోమవారం రాత్రి అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. లక్ష్మితో గొడవ పడ్డాడు. మంగళవారం ఉదయం దుర్గారావు ఏడుస్తూ, అరుస్తూ తన భార్య గుండెపోటుతో మరణించిందని చెప్పడం ప్రారంభించాడు. స్థానికులకు అతనిపై అనుమానం కలిగింది. అతన్ని పోలీసులకు అప్పగించారు. నిద్రిస్తున్న సమయంలో భార్యను చంపాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానికులు దుర్గారావును పట్టుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత పోలీసులను పిలిచారు. దీంతో అసలు విషయం బయటపడింది.

English summary
Suspecting fidelity, a man killed his wife at New Rajarajeswaripet in the city on Tuesday. The neighbours were shocked as the accused chose the wedding anniversary to murder the woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X