టిక్కెట్ రాకుంటే ఏం చేస్తానో అప్పుడే చెప్తా: రాములమ్మ

తనను మెదక్ ప్రజల నుంచి ఎవరు వేరు చేయలేరని అన్నారు. తన మార్పు విషయమై పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పుడు తనతో మాట్లాడలేదన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలే తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.
భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ తనను సొంత బిడ్డలా చూసుకున్నారని ఆమె అన్నారు. తెరాస సెక్రటరీ జనరల్ పదవికి తనంతట తానే రాజీనామా చేశానన్నారు. ఆ పదవిని తెలంగాణ సీనియర్ నేత కె కేశవ రావుకు ఇవ్వడం మంచిదేనని విజయశాంతి అన్నారు.
కాగా, ఈ రోజు విజయశాంతి జన్మదినం కావడంతో ఆమె హైదరాబాదు చర్లపల్లిలోని స్ఫూర్తి ఫౌండేషన్ అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం ఆనందం కలిగించిందన్నారు. అశ్రమంలోని విద్యార్థులకు ఆమె వస్తువులను అందచేశారు.












Click it and Unblock the Notifications