తెలంగాణ: కెకెతో కాంగ్రెసు అధిష్టానం తెర వెనుక

K Keshav Rao
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలతో తెరవెనుక చర్చలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెరాస జాతీయ వ్యవహారాల సెక్రటరీ జనరల్ మంళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్‌తో సమాలోచనలు జరిపారు.

ప్రత్యేక తెలంగాణ అంశంపైనే ఆ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ ప్రధాన కార్యదర్శి ఒకరు కేశవరావుతో దాదాపు గంటపాటు చర్చలు జరిపినట్లు సమాచారం. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు పరిశీలిస్తున్న పలు ప్రతిపాదనలపై సమాలోచనలు సాగినట్టు సమాచారం. రాయల తెలంగాణను ఏర్పాటు చేయటమా? లేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామనే హామీతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించటమా? లేక హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పెట్టి రాష్ట్ర విభజన చేయటమా? అనే మూడు, నాలుగు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు వార్తలు రావటం తెలిసిందే.

ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఈ ప్రతిపాదనలన్నింటిపై కేశవరావుతో చర్చించారని అంటున్నారు. కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనలపై కేశవరావు తెరాస అభిప్రాయాన్ని ప్రధాన కార్యదర్శికి వివరించారనీ, దీనిపై కాంగ్రెస్ ఎంతవరకు సర్దుబాటు చేయగలదు, ఏ మేరకు దిగిరాగలుగుతుందనేది ఆయన వివరించారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే పక్షంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనేది కూడా చర్చించి ఉంటారని అంచనా వేస్తున్నారు.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమకు మద్దతిచ్చే విధంగా తెరాస, మజ్లీస్‌లను ఒప్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. కేశవరావు సదరు ప్రధాన కార్యదర్శితోపాటు కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేతతోనూ చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇదిలాఉంటే కేశవరావు మంగళవారం కేంద్ర సైన్సు, టెక్నాలజీ శాఖ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డిని కలుసుకుని తెలంగాణ ఏర్పాటు అంశంపై మంతనాలు సాగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+