'రాయల తెలంగాణ'పై బైరెడ్డి ఫైర్, మేలేనని మంత్రుల్లో...
రాయల తెలంగాణపై ప్రచారం జరుగుతుండటంతో ఆయన తన ట్రాక్టరు యాత్రను నిలిపివేశారు. జూలై 4న హైదరాబాదులో 52 గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు. తమ సీమలో ఉన్న 52 ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి గంట చొప్పున 52 గంటలు ఈ దీక్ష ఉంటుందని బైరెడ్డి చెప్పారు.
రాయల తెలంగాణపై మంత్రుల్లో....
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల్లో స్పష్టమైన విధాన ప్రకటన చేయవచ్చునని భావిస్తున్న నేపథ్యంలో రాయల తెలంగాణ ఏర్పాటైతే రెండు రాష్ట్రాల్లోని సమీకరణాలు తమకు అనూకూలిస్తాయని కొందరు కాంగ్రెసు నేతలు విశ్లేషిస్తున్నారు. తెరాస, బిజెపి వంటి పార్టీలు రాయల తెలంగాణకు విముఖంగా ఉన్నా... సీమలోని రెండు జిల్లాల్ని తెలంగాణలో కలపడం ద్వారా వివిధ రూపాల్లో కాంగ్రెసుకు అనుకూల స్థితి ఏర్పడుతుందని వీరు అంచనా వేస్తున్నారు.
రెండు జిల్లాల్ని కలిపి తెలంగాణ ఇచ్చినా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెసు పార్టీయే కాబట్టి తమకు లాభిస్తుందని కాంగ్రెసు పార్టీ నేతలు భావిస్తున్నారట. రాయల తెలంగాణ అయితే ఇటు రెడ్డి, అటు కాపు ఓట్ల ద్వారా రెండు రాష్ట్రాల్లోను కాంగ్రెసు పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశముందని భావిస్తున్నారట. పలువురు తెలంగాణ మంత్రుల్లోను ఈ వాదన వినిపిస్తోందని అంటున్నారు.