తెరాస కనుమరుగవుతుంది: ఎర్రబెల్లి, కెసిఆర్పై ఫైర్

అటు సమ్మెను, ఇటు ఉద్యమాన్ని నీరుగార్చాడని ఆరోపించారు. కేసీఆర్ ఏ మీటింగ్లోనూ సోనియాను విమర్శించలేదని , దానికి కారణమేంటో అందరికీ తెలుసన్నారు. కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకువచ్చి మంత్రి పదవి వచ్చేలా అధిష్ఠానంపై ఒత్తిడి చేసింది తానే అని చెప్పుకున్నారు. అలాంటి శ్రీహరి విశ్వాసం లేకుండా తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నెల 7వ తేదీ ప్రాంతీయ సభా ప్రాంగణాన్ని తెలుగుదేశ జిల్లా నేతలు శుక్రవారం సాయంత్రం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లన్నీ శనివారం మధ్యాహ్నానికే పూర్తవుతాయని చెప్పారు. ఆదివారం ఉదయం 9గంటల నుంచి సభా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని ఎర్రబెల్లి చెప్పారు.
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలుత సభా ప్రాంగణంలో పార్టీ పతాకాన్ని అవిష్కరిస్తారని, అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేస్తారని చెప్పారు. సభా ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటిస్తారని, చార్ధామ్ మృతులకు సంతాపం ప్రకటిస్తారని తెలిపారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు రానున్న మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, అందుకు పార్టీ శ్రేణులు చేయవలసిన కృషిపై సభలో ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications