ఎక్కువ ఊహించుకున్నారు, జగన్ సస్పెన్షన్ ఏది: బాబు

రాష్ట్ర ఆదాయం పెరిగింది కానీ అభివృద్ధి జరగలేదన్నారు. అవినీతిపై పోరాడేందుకు ఇప్పుడు యువత ముందుకు వస్తోందన్నారు. తమ పార్టీ బలం కార్యకర్తలేనని మరోసారి పంచాయతీ ఎన్నికల ద్వారా రుజువయిందన్నారు. అభివృద్ధికి అవినీతి అడ్డుగా మారిందన్నారు. సుపరిపాలన, సుస్థిర పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల ద్వారా కొన్ని లెసన్స్ వచ్చాయన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరాచక, అబద్దాల, అసత్యాల పార్టీ అని మండిపడ్డారు. 2275 స్థానాల్లో గెలుపొందినట్లుగా సాక్షిలో వచ్చిందని, అబద్దాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అబద్దాలు చెప్పేందుకు కూడా సిగ్గుపడటం లేదన్నారు. ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రపంచంలో కనీవినీ ఎరగని అవినీతి రాష్ట్రంలో జరిగిందని, అందుకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే బాధ్యులన్నారు.
జగన్ పార్టీ నేతలు ఎటిఎం దొంగతనాల్లో, దొంగనోట్ల వ్యవహారంలో.. ఇలా పలు కేసుల్లో ఉన్నారన్నారు. సిద్ధార్థ రెడ్డి పైన ఆరోపణలు వస్తే సస్పెండ్ చేసిన పార్టీ జగన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. వారి పైన కేవలం ఆరోపణలే వచ్చాయని, జగన్ పైన ఛార్జీషీట్ వేసి, జైలుకు కూడా పంపించారని అయినా సస్పెండ్ చేయలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టిందే అవినీతి కాంగ్రెసు నుండి అన్నారు.
ఆ పార్టీ చరిత్ర అరాచకాలు, మారణ హోమమే అన్నారు. కడపలో ఎన్ని ఘోరాలు జరిగాయో అందరికీ తెలుసన్నారు. అక్కడ ఇప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కు వినియోగించునే పరిస్థితి లేదన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లిక్కర్ డాన్ అని విమర్శించారు. పలు జిల్లాల్లో టిడిపి వెనుకుండడానికి గల కారణాలను విశ్లేషించుకుంటామని చెప్పారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications