జెండాలు కాల్చండి: జగన్ పార్టీపై ఓయు జెఏసి నిప్పులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన పదహారు మంది శాసన సభ్యులు విభజన విషయంలో కాంగ్రెసు వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ ప్రాంత నేతలు, జెఏసిలు తీవ్రంగా స్పందించాయి. తెలంగాణను అడ్డుకోవడానికే రాజీనామాలకు తెర తీశారని ఓయు జెఏసి నేతలు ఆరోపించింది.
ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దిష్టి బొమ్మలను దహనం చేయాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని హబ్సిగూడలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జెండాను కూల్చివేశారు.
అడుగు పెట్టనివ్వం: తెలంగాణ నేతలు
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అడ్డుకోవద్దంటూ సీమాంధ్ర నేతలకు తెలంగాణ కాంగ్రెస్నేతల విజ్ఞప్తి చేశారు. అన్నదమ్ముల్లా విడిపోయి కలిసుందామని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునేవారిని క్షమించబోమని వారు హెచ్చరించారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అడ్డుకుంటే సీమాంధ్ర నేతలతోపాటు సిఎం, బొత్సలను సైతం తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని వారు హెచ్చరించారు. తెలంగాణ అంశంపై అధిష్ఠానం నిర్ణయానికి అందరమూ కట్టుబడదామని సమాచార శాఖ మంత్రి డీకే అరుణ హైదరాబాద్లో అన్నారు. ఈ విషయంలో అందరమూ సంయమనం పాటిద్దామన్నారు. తెలంగాణ విషయంలో తమకు అధిష్ఠానం, సోనియాలపై పూర్తి నమ్మకముందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. తెలంగాణ ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందడనడం సరికాదని కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. నక్సలైట్లు మన సోదరులో అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications