కూతురిని కొట్టి చంపిన తల్లి, బిడ్డను బలి చేసిన మహిళ

Mom beats child
హైదరాబాద్: ఓ తల్లి అనుచితమైన ఆగ్రహానికి ఆరేళ్ల ఆమె కూతురు బలైంది. గౌసియా బేగం అనే మహిళ తన ఆరేళ్ల చిన్నారి ఫర్షా బేగంను పెద్ద గరిటెతో తీవ్రంగా కొట్టింది. దీంతో ఆ పాప మృత్యు ఒడిలోకి చేరుకుంది. ఈ సంఘటన హైరాబాదులోని బంజారాహిల్స్‌లో గల జహ్రానగర్‌లో గురువారంనాడు చోటు చేసుకుంది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - ఫర్హా బేగం ఇంటి బయట ఇసుకలో ఆడుకుంటోంది. దాంతో ఆగ్రహానికి గైరన గౌసియా పెద్ద గరిటెతో ఆమెను కొట్టడం ప్రారంభించింది. దీంతో శ్వాససంబంధమైన సమస్య తలెత్తి ఫర్హా మరణించింది. ఫర్హాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఎడతెగకుండా కొట్టడం వల్ల రమణించింది.

చిన్నపాటి తగాదాకు తీవ్రంగా ఆగ్రహించిన ఓ మహిళ తన నాలుగేళ్ల కూతురితో పాటు చెరువులో దూకింది. ఈ సంఘటన మేడ్చెల్‌లో నాలుగు రోజుల క్రితం చోటు చేసుకుంది. మహిళను స్థానికులు రక్షించారు. కానీ నాలుగేళ్ల పాప మృత్యువు పాలైంది. మంగళవారంనాడు పాప శవాన్ని బయటకు తీశారు.

మరణించిన పాపను నాలుగేళ్ల స్రవంతిగా గుర్తించారు. మేడ్చెల్‌లోని కండ్లకోయకు చెందిన నర్సింహ, సరితల కూతురు. నాలుగు రోజుల క్రితం నర్సింహ, సరిత గొడవ పడ్డారు. భర్త ఆమెను తిట్టి బయటకు వెళ్లిపోయాడు. అతను అలా వెళ్లిపోగానే సరిత తన కూతురిని తీసుకుని బయటకు వెళ్లి చెరువులో దూకింది. పోలీసులు సరితపై కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+