నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదం: నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Four Engineering students died
హైదరాబాద్/గుంటూరు/నెల్లూరు: గుంటూరు జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వడ్లమూడిలోని ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్న నలుగురు యువకులు ద్విచక్ర వాహనపై కాలేజీకి బయలుదేరారు.

చేబ్రోలు మండలం నారాకోడూరు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బస్సు ద్విచక్ర వాహన్నాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

నెల్లూరులో ఒకరు మృతి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రాదంలో ఒకరు మృతి చెందారు. నెల్లూరు నుండి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురంలో వాహనం ఢీకొని పెద్దవడుగూరు మండలం మెడ్తూరు వద్ద ఒకరు మృతి చెందారు.

నల్లొండ కిష్టాపురంలో ఉద్రిక్తత

నల్గొండ జిల్లా కిష్టాపురంలో ఈ రోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. విద్యా కమిటీ చైర్మన్ ఎన్నిక వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసమయ్యాయి.

చిరుత మృతి

చిత్తూరు జిల్లా తిరుమల కనుమ రహదారిలో ఈ రోజు ఉదయం చిరుత మృతి చెందింది. నాలుగో కిలో మీటరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.

English summary
Four Engineering students died in road mishap at Narakoduru in Guntur district on Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X