బాలికపై అత్యాచారం చేసి, ఆమె టైతోనే హత్య చేశాడు
బాలిక పాఠశాల నుండి ఇంటికి వెళ్తుండగా అతను ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె వేసుకున్న స్కూలు యూనిఫాం టైతో గొంతు బిగించి హత్య చేశాడు. పోలీసులు ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తన కుమార్తెను రోజు తానే ఇంటికి తీసుకు వెళ్లేవాడినని, ఆ రోజు వీలుకాకపోవడంతో పాప నడిచి వచ్చే సమయంలో ఈ దారుణం జరిగిందని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తండ్రి డిమాండ్ చేశారు.
ప్రశాంతంగా ఉండే తమ గ్రామంలో ఇలాంటి సంఘటన కలచివేసిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుణేకు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే గలంద్వాడి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
నిందితుడిని 22 ఏళ్ల నితిన్ కదమ్గా గుర్తించారు. ఇతనిని శనివారం రాత్రి పక్క గ్రామం నిలక్వాడిలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఇతనిని సెప్టెంబర్ 2 తేది వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన ఆశ్రమ్ పాఠశాలకు మహారాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల రివార్డ్ ఇచ్చింది.