దూషణ: సందీప్ డౌన్డౌన్ అంటూ సభలో నినాదాలు
కాగా, సందీప్ పైన టిడిపి ఎంపి నామా నాగేశ్వర రావు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందిందని స్పీకర్ సభలో వెల్లడించారు. అలాగే సీమాంధ్ర టిడిపి ఎంపీలపై కాంగ్రెసు ఎంపీలు పొన్నం ప్రభాకర్, తదితరులు ఇచ్చిన నోటీసు అందినట్లు తెలిపారు.
మరోవైపు, సమావేశాలు ముగుస్తున్న బొగ్గు కుంభకోణంపై చర్చ చేపట్టలేదని బిజెపి ఆందోళన చేపట్టింది. బొగ్గు దస్త్రాల గల్లందుపై ప్రధాని మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పాలని సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. సభలో సజావుగా జరగకపోవడంతో స్పీకర్ పన్నెండు గంటలకు వాయిదా వేశారు.
సోమవారం సీమాంధ్ర తెలుగుదేశం, కాంగ్రెసు ఎంపీలు సస్పెండైన విషయం తెలిసిందే. మంగళవారం సమావేశాలు ప్రారంభం కాగానే తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ టిడిపి సీమాంధ్ర ఎంపీలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో చైర్మన్ సుజనా చౌదరి, సిఎం రమేష్లను సస్పెండ్ చేశారు. పలువురు ఎంపీలు పార్లమెంటు ద్వారం వద్ద బైఠాయించారు.