వేదికపై గజల్ శ్రీనివాస్ గళం: చానెళ్లకు సిపి ఆంక్షలు
'సేవ్ ఆంధ్రప్రదేశ్ ' సభ నేపథ్యంలో ఎల్బీస్టేడియం వద్దకు పెద్ద యెత్తున ప్రజలు చేరుకున్నారు. సీమాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు తరలి వచ్చారు. ఎపీఎన్జీవోలు సభకు భారీగా తరలివస్తున్నారు.స్డేడియంలోని గ్యాలరీలన్ని ఉద్యోగులతో నిండిపోయాయి. గుర్తింపు కార్డు ఉన్న వారిని పోలీసులు లోనికి అనుమతినిస్తున్నారు. స్డేడియం మొత్తం సమైక్య నినాదాలతో హోరెత్తుతోంది.
ఏపీఎన్జీవోల సభ, తెలంగాణ బంద్ నేపథ్యంలో మీడియా ఛానెళ్లకు పోలీసులు పలు ఆదేశాలు చేశారు. ఏపీఎన్జీవో సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు ఫైల్ షాట్స్ పదేపదే వేయొద్దని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్శర్మ ఆదేశించారు. దాడులు, హింసాత్మక ఘటనలు ప్రసారం చేయవద్దని ఆదేశించారు..
కాగా, ఏపీఎన్జీవో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ సందర్భంగా నగరంలో పలుచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి 6 గంటలకు ఆంక్షలు కొనసాగనున్నాయి. సభ జరిగే ఎల్పీస్టేడియం వైపు వెళ్లే మార్గాలైన ఖైరతాబాద్, అబిడ్స్, గన్ఫౌండ్రి,ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, బషీర్బాగ్, కింగ్ కోఠి, హిమాయత్నగర్,లిబర్టీ చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.