గుంటూరు ఘాటుకి సోనియా పరార్! తెగబడతా: బాబు

Chandrababu Naidu
విజయవాడ: రాష్ట్ర విభజనపై కాంగ్రెసు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు మిరపకాయల్లా ఎంపీలు వ్యవహరిస్తుండటంతో ఆ ఘాటుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉక్కిరి బిక్కిరి అయ్యారని, అందుకే సమాధానం చెప్పలేని స్థితిలో అమెరికా పారిపోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారని, వారి మనసులను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారని, ఓట్లు, సీట్ల కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నారని, సీమాంధ్రను అతలాకుతలం చేశారని, ఎపికి ఇప్పటికైనా న్యాయం చేయకపోతే కాంగ్రెసు పై తెగబడి పోరాడుతామన్నారు. ప్రజల కోసం తాను తెగబడి.. తిరుగబడతానన్నారు. తెలంగాణకు న్యాయమంటే సీమాంధ్రకు అన్యాయమని కాదన్నారు.

చిచ్చుపెట్టిన వారు మనుగడ సాధించడానికి వీల్లేదన్నారు. కాంగ్రెసు పార్టీకి కనువిప్పు కలగడం లేదని, తమ పార్టీ జోలికొస్తే మసైపోతారన్నారు. ఇరు పక్షాల ప్రజలతో మాట్లాడాలని, ఇద్దరికీ న్యాయం జరగాలని, అలా కాకుండా సీమాంధ్రకు అన్యాయం జరిగితే తిరగబడతానని చెప్పారు. సీమాంధ్రుల ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని, టిడిపి సమైక్యానికి ఒకప్పుడు కట్టుబడి ఉన్న మాట వాస్తవమేనని, ఆ తర్వాత తెలంగాణ ప్రజల ఉద్యమం, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వారి సమస్యలను పరిష్కరించాలని లేఖ ఇచ్చిన మాట వాస్తవమే అన్నారు.

అయినా మీకు ఎక్కడా అన్యాయం చేయమనలేదన్నారు. సీమాంధ్రలో ఉండే తెలుగువారికి ఇబ్బందులు ఉన్నాయని, 37 రోజులుగా ప్రజలు రోడ్లపై ఉన్నారని, ఇప్పటికీ కాంగ్రెస్‌కు కనువిప్పు కలగలేదని, మొద్దు నిద్రలో ఉందని, ఇప్పటికైనా కాంగ్రెసు నిర్ణయం మార్చుకోవాలని, లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. సోనియాకు సీట్లు కావాలంటే తెలుగువాళ్లు కొట్లాడుకోవాలా? అంటూ ప్రశ్నించారు.

ప్రజల ఆవేద, ఆగ్రహాన్ని అర్థం చేసుకోకుండా పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్న కాంగ్రెసు సంగతిని తేల్చేయడానికి టిడిపి నడుం కట్టిందని, కురుక్షేత్రం జరుగుతోందని, కౌరవ సంతతైన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఓటమి తప్పదన్నారు. అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించి అందులో రాజకీయ లబ్ధి పొందాలని వైయస్సార్ కాంగ్రెసు చూస్తోందని దుయ్యబట్టారు.

బైబిల్ వంటి పవిత్రమైన బైబిల్‌ను ప్రజలకు న్యాయం జరగాలని, ప్రపంచానికి మంచి జరగాలనుకునే వారు పట్టుకుంటారని, చెడును ప్రోత్సహించే మనసుతో, అబద్ధాలతో పత్రికలు పెట్టిన వారు బైబిల్‌ను పట్టుకోవడం ఏమిటి? ఓడిపోతామన్న ఉద్దేశంతో 1999లో తెలంగాణాకు అనుకూలంగా ఎమ్మెల్యేలను దివంగత వైయస్ ఢిల్లీకి పంపారని, 2004లో తెరాసతో పొత్తు పెట్టుకున్నారని, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెస్‌తో లాలూచీ పడకపోతే జైల్‌లో ఉన్న జగన్ చేపట్టిన దీక్ష నేరమైనా హెల్త్ బులెటిన్‌లు ఎందుకు ప్రకటిస్తారు? అంతా జగన్నాటమన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+