ఆ పార్టీనే బంగాళాఖాతంలో కలపండి: నిర్మల్లో కేసీఆర్, పార్టీ, కలెక్టరేట్ ఆఫీస్ ప్రారంభం
ఆదిలాబాద్: తెలంగాణ మోడల్ దేశమంతా మార్మోగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందుకు ప్రభుత్వ ఉద్యోగులే కారణమని వ్యాఖ్యానించారు. జిల్లా కేంద్రమైన నిర్మల్లో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, రూ. 56.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు.
Live: CM Sri KCR inaugurating Nirmal District Integrated Offices' Complex. https://t.co/57b39cSuRl
— Telangana CMO (@TelanganaCMO) June 4, 2023
నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకంగా రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిర్మల్, ముథోల్, ఖానాపూర్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున, జిల్లాలోని 19 మండలాలకు ప్రతి మండల కేంద్రానికి రూ. 20 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. బాసర ఆలయాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోబోతున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.

గతంలో ఆదిలాబాద్ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉంటే.. ఇప్పుడు నాలుగు జిల్లాలు అయిన తర్వాత మరో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు కేసీఆర్. పేదల కోసం నిర్మించిన 2వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. అవినీతికి అడ్డుకట్ట వేసిన ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని మండిపడ్డారు.
నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ భవన… pic.twitter.com/Lpee1RvOvg
— Telangana CMO (@TelanganaCMO) June 4, 2023
ధరణిని బంగాళాఖాతంలో వేయాలన్న వారిని బంగాళాఖాతంలో వేయాలన్నారు కేసీఆర్. మళ్లీ అవినీతికి తెరలేపడానికి కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ ఉండటం వల్లే 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోందన్నారు. ధరణిని తొలగిస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయా? అని ప్రశ్నించారు.
ఎస్ఆర్ఎస్పీ కింద 2 స్కీంలు త్వరలో పూర్తి చేస్తామని.. దీంతో లక్ష ఎకరాలకు నీళ్లందుతాయన్నారు. గత 9 ఏళ్లలో తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యాయని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ పథకాలు కావాలంటున్నారని తెలిపారు. దేశంలో తెలంగాణ రోల్ మోడల్గా నిలుస్తోందన్నారు. అందుకే, ప్రజలంతా తమకు అండగా ఉండాలని కోరారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications