ఏపీలో 1433 కరోనా కేసులు: 15 మంది మృతి
కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతుండగా.. ఏపీలో అయితే స్వల్పంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1433 పాజిటివ్ కేసులు వచ్చాయి. వైరస్ బారినపడిన వారిలో 1815 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టివరకు మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,97,102కు చేరింది. వీరిలో మొత్తం 19,67,472 మంది కోలుకున్నారు. ఇంకా 15,944 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాలు 13686కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 68,041 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications