లైవ్: ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా ప్రారంభమైన 70వ గణతంత్ర వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌లో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. గణతంత్ర వేడుకల్లో భాగంగా రాజధాని అమరావతి అత్యంత సుందరంగా ముస్తాబైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. గవర్నర్ నరసింహన్ జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్ర బాబునాయుడు, మంత్రులు, ప్రజలు పాల్గొన్నారు.

70Th Republic day celebrations in AP live updates

Jan 26, 2019, 9:05 am IST

గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగం: దేశంకన్నా రాష్ట్రం అభివృద్ధిలో ముందుంది.
Jan 26, 2019, 9:03 am IST

గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగం: విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది
Jan 26, 2019, 9:02 am IST

గవర్నర్ ప్రసంగం: విద్యుత్ కొరతను అధిగమించాం. గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత మంచినీరును అందిస్తున్నాం
Jan 26, 2019, 9:00 am IST

గవర్నర్ ప్రసంగం: రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. నీటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది
Jan 26, 2019, 8:56 am IST

గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగం: సాంకేతికతను జోడించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పయనిస్తోంది
Jan 26, 2019, 8:51 am IST

గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగం: నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది
Jan 26, 2019, 8:50 am IST

గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రసంగం: రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి. జనవరి నుంచి పెన్షన్లు రూ.2వేలకు పెంచాం
Jan 26, 2019, 8:37 am IST

గ్రామీణశాఖ శకటం పరేడ్‌లో ఆకట్టుకుంది. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మల్లాంటివని శకటం సూచించింది. గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ శకటం ద్వారా తెలిపారు
Jan 26, 2019, 8:36 am IST

ఏపీ సంక్షేమ ఫలితాలను ప్రజల్లో అవగాహన కలిగేలా ఎంతో కృషి చేస్తోంది రాష్ట్ర సమాచార శాఖ. పరేడ్‌లో ఈ రాష్ట్ర సమాచార శాఖ శకటాన్ని ప్రదర్శించారు
Jan 26, 2019, 8:35 am IST

ఉద్యాన పంటలకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెబుతూ ఉద్యాన శకటం ప్రదర్శించారు. పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ శకటం కూడా ప్రదర్శించారు. పారిశ్రామికంగా ఏపీ ముందుకెళుతోందని ఈ శకటం సూచిస్తోంది
Jan 26, 2019, 8:15 am IST

ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంలో భాగంగా ఒడిషా కంటింజెంట్ తమ కవాతును గణతంత్ర వేడుకల్లో నిర్వహించింది
Jan 26, 2019, 8:07 am IST

ఆంధ్ర ప్రదేశ్‌లో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీస్ బెటాలియన్ నుంచి గవర్నర్ గౌరవవందనం స్వీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+