23 శాతం ఫిట్ మెంట్, పెరిగిన హెచ్ఆర్ఏ, తర్వలో పీఆర్సీ నివేదిక: సజ్జల
హమ్మయ్యా ఉత్కంఠకు తెరపడింది. మరో 24 గంటల్లో మోగే సమ్మెకు బ్రేక్ పడింది. మంత్రుల కమిటీతో జేఏసీ స్టీరింగ్ కమిటి జరిపిన చర్చలు విజయవంతంగా ముగిశాయి. దీంతో ఉద్యోగులు యథావిధిగా విధుల చేయబోతున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్ని డిమాండ్ల వల్ల చర్చలు ఆలస్యమయ్యాయని వివరించారు. ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేశామని సజ్జల వివరించారు. గతంలో నిర్ణయించిన విధంగా ఫిట్మెంట్ ఇస్తున్నామని.. ఇందులో ఎలాంటి మార్పులేదని స్పష్టంచేశారు. HRA శ్లాబులు స్వల్పంగా పెరిగిందని చెప్పారు. పీఆర్సీ నివేదికను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

థాంక్స్
ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని పెద్ద మనసుతో గ్రహించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస్ తెలిపారు. అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చారని పేర్కొన్నారు. అడగకుండానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని తెలిపారు. ఉద్యోగుల పట్ల సీఎం జగన్కు ఎంతో ప్రేమ ఉందన్నారు. సీఎం జగన్ పై ఉద్యోగులకు నమ్మకం ఉందని చెప్పారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదని సీఎం జగన్ ఎప్పుడూ చెబుతుంటారని గుర్తుచేశారు. అంతా ఒక కుటుంబంగా పనిచేయాలని సీఎం జగన్ చెప్పేవారని తెలిపారు. ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్న ఆవేదనతో ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశామని.. ఉద్యోగులు అన్న మాటలను మరోలా భావించొద్దు అని సూచించారు. సమ్మెను విరమించుకుంటున్నామని తెలియజేశారు.

వర్చువల్గా మాట్లాడిన జగన్
స్టీరింగ్ కమిటీ సభ్యులు.. సీఎం జగన్తో వర్చువల్ గా మాట్లాడారు. మంత్రుల కమిటీ అంగీకరించిన డిమాండ్లపై ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఒప్పంద పత్రాన్ని అధికారులు సీఎం జగన్కు పంపారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు. పీఆర్సీ ఆశించినంతగా లేకపోవడంతో అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగుల ఆవేదన గురించి మంత్రుల కమిటీ చర్చించిందన్నారు. అన్ని అంశాలపై లోతుగా చర్చించి ఏకాభిప్రాయంకి వచ్చామన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా అంతా ఓ కుటుంబంలా ఉండాలన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చెయ్యడంలో ఉద్యోగులది కీలక పాత్ర అని చెప్పారు. ఉద్యోగులు ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలని సీఎం జగన్ అనుకుంటారని సజ్జల అన్నారు. కొన్ని డిమాండ్ల వల్ల చర్చలు ఆలస్యం అయ్యాయని ఆయన తెలిపారు. ప్రతి అంశంపైనా లోతుగా చర్చించామని అన్నారు.

23 శాతం ఫిట్ మెంట్
'జీవో ఇవ్వగానే రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఫిట్ మెంట్ 23 శాతంలో ఎలాంటి మార్పు లేదు. 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో 16 శాతం HRA ఇవ్వడానికి అంగీకరించారు. HOD, సచివాలయంలో ఉద్యోగులకు జూన్ 2024 వరకూ 24 శాతం HRA ఇవ్వడానికి అంగీకారం. పెన్షనర్ల 70 నుండి 74 వారికి 7 శాతం.. 74 నుండి 79 శాతం 12 శాతం. పీఆర్సీ ఐదేళ్ల పాత పద్దతి కొనసాగుతుంది. CCL పాత రేట్లు ప్రకారమే కొనసాగుతుంది. ఆర్టీసీ, యూనివర్సిటీలకు సెపరేట్ పీఆర్సీ జీవో విడుదల అవుతుంది" అని సజ్జల తెలిపారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications