Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నదాతలను ఆదుకోండి, రైతుల వెతల వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్..

నివర్ తుపాన్ బీభత్సంతో అన్నదాత నడ్డి విరిగింది. రైతులతోపాటు కౌలు రైతుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రప్రదేశ్‌లో కొందరి బాధలను టీడీపీ నేత నారా లోకేశ్ ప్రస్తావించారు. వారి సమస్యలతో కూడిన వీడియోను ట్వీట్ చేశారు. ఏపీ సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఆ రైతుల సమస్యలు పట్టడం లేదా అని అడిగారు. వారిని ఆదుకోవాలని కోరారు.

తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలతో ఏపీలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది. చేతికి అందిన పంట తుపాను పాలయ్యింది. సర్వం కోల్పోయిన రైతులు సాయం కోసం ఎదురుచూస్తున్నారని నారా లోకేశ్ వెల్లడించారు. కౌలు రౌతుల కష్టం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రైతులు వేడుకుంటున్నా సీఎం జగన్ మనసు కరగడం లేదని విమర్శించారు. ఇదేనా జగన్ చెప్పిన అవినాభావ సంబంధం అని అడిగారు.

pls..help to farmers, nara lokesh asks cm jagan..

ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని లోకేశ్ అన్నారు. ఆ రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులను వెంటనే పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఓ కౌలు రైతు ఎకరం 30 వేలకు తీసుకున్నాడు.. రూ.15 వేల పెట్టుబడి పెట్టాడు. కానీ చేతికొచ్చిన పంట మాత్రం నీట మునిగింది. ఇలా పలువురు ఆ వీడియోలో తమ గోడును వెల్లబోసుకున్నారు. మరో రైతు రూ.50 వేల పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+