ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్.. సోమవారం నుంచి క్యాష్లెస్ బంద్
అమరావతి : ఎన్టీఆర్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ తరపున అందిస్తున్న వైద్యసేవలు సోమవారం నుంచి నిలిచిపోనున్నాయి. ఈమేరకు ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ASHA)వెల్లడించింది. దీంతో ఆరోగ్య రక్ష, ఉద్యోగులు, జర్నలిస్టులకు అందించే నగదు రహిత వైద్యసేవలకు అంతరాయం ఏర్పడనుంది. అయితే ఎమర్జెన్సీ కేసుల్లో సేవలు అందిస్తామని అసోసియేషన్ తెలిపింది.
450 ఆస్పత్రులకు గాను దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ప్రభుత్వం పెండింగ్ లో ఉంచినట్లు అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు అందించిన వైద్య సేవలకు సంబంధించి 80 వేల క్లెయిమ్స్ ఎన్టీఆర్ హెల్త్ సర్వీస్ ట్రస్టు కార్యాలయంలో పరిశీలనకు నోచుకోలేదని వాపోతున్నారు. 30 రోజుల్లోగా పాత బకాయిలు చెల్లించని పక్షంలో వైద్య సేవలు నిలిపివేస్తామని ప్రకటించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.













Click it and Unblock the Notifications