ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్.. సోమవారం నుంచి క్యాష్లెస్ బంద్
అమరావతి : ఎన్టీఆర్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ తరపున అందిస్తున్న వైద్యసేవలు సోమవారం నుంచి నిలిచిపోనున్నాయి. ఈమేరకు ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ASHA)వెల్లడించింది. దీంతో ఆరోగ్య రక్ష, ఉద్యోగులు, జర్నలిస్టులకు అందించే నగదు రహిత వైద్యసేవలకు అంతరాయం ఏర్పడనుంది. అయితే ఎమర్జెన్సీ కేసుల్లో సేవలు అందిస్తామని అసోసియేషన్ తెలిపింది.
450 ఆస్పత్రులకు గాను దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ప్రభుత్వం పెండింగ్ లో ఉంచినట్లు అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటివరకు అందించిన వైద్య సేవలకు సంబంధించి 80 వేల క్లెయిమ్స్ ఎన్టీఆర్ హెల్త్ సర్వీస్ ట్రస్టు కార్యాలయంలో పరిశీలనకు నోచుకోలేదని వాపోతున్నారు. 30 రోజుల్లోగా పాత బకాయిలు చెల్లించని పక్షంలో వైద్య సేవలు నిలిపివేస్తామని ప్రకటించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.

More From
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications