చండ్ర నిప్పులు: రాజధానులపై మాట్లాడే హక్కు లేదు, జగన్పై ఫైర్
3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో సీఎం జగన్ కామెంట్ చేశారు. ఇదీ ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. వెంటనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అసెంబ్లీలో మూడు ముక్కలాటకు సీఎం జగన్ తెరతీశారని చంద్రబాబు అన్నారు. 3 రాజధానులపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. మోసాలు, ఘోరాలు చేయడంలో జగన్ దిట్టన్నారు. అధికార వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని ఆయన సూచించారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఒక శని గ్రహంలా తయారయ్యారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

నమ్మకద్రోహం..
ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన జగన్కు పాలించే హక్కు లేదని ధ్వజమెత్తారు. సీఎం పదవీకి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అప్పుడు రావాలని.. మాట్లాడుదామని చంద్రబాబు సవాల్ విసిరిరారు. ప్రజాస్వామ్యం అంటే జగన్కు లెక్కలేదని చెప్పారు. కోర్టు తీర్పులను శిరసా వహించాలే తప్ప.. ధిక్కరించకూడదని సూచించారు.

అప్పుడేం చేశారు..
అమరావతి రాజధానిని ప్రకటించిన సమయంలో జగన్ ఉన్నారని.. ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదని చంద్రబాబు అడిగారు. అమరావతి సెల్ప్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చెప్పారు. అక్కడ ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా.. అభివృద్ది చేయొద్దా అని అడిగారు. మరీ తనను ఇల్లు కట్టుకోలేదని మాత్రం అడుగుతారని చెప్పారు. ల్యాండ్ పూలింగ్లో రియల్ ఎస్టేట్ ఏంటీ అని అడిగారు.

లేని ససమ్యలు
లేని సమస్యలను జగన్ సృష్టిస్తున్నారని చంద్రబాబు ఫైరయ్యారు. అందరూ తన వద్దకు కాళ్ల బేరానికి రావాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపీపై దాడి చేయడం ఏంటీ అని చంద్రబాబు అడిగారు. పరిటాల రవీంద్ర హత్య కేసు.. నిందితుల సంగతి ఏమైందని అడిగారు. అలా రాష్ట్రంలో పాలన చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. మూర్ఖత్వంతో జగన్ ముందుకు వెళుతున్నారని.. తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రజల కోసం.. ప్రజా సమస్యలపై టీడీపీ పోరాడుతుందని చంద్రబాబు తెలిపారు.

పోరుబాట
మద్యపాన నిషేధం కోసం తాము పోరుబాట పట్టామని చెప్పారు. ఇష్ట ప్రకారం రాజధానులపై ముందుకు వెళతామని చెప్పడం సరికాదని అన్నారు. జగన్ మోసపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కౌరవులు కూడా 101 మంది ఉన్నారని అనుకున్నారని.. జగన్ను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ధర్మం, న్యాయమే గెలుస్తోందని సూచించారు. ప్రజలు అనుకుంటే 1, 5 పోతాయని.. సున్న మిగులుతుందని చెప్పారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications