టీడీపీలో ఉంటే లాభం లేదు ... వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై జేసీ
వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై అనంతపురం టిడిపి నేత, మాజీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ ఒక ఎమ్మెల్యే గా మాత్రమే తనకు తెలుసని, అతనితో పెద్ద పరిచయం కూడా లేదని చెప్పిన జెసి దివాకర్ రెడ్డి పార్టీ మారే నేతలు ఎవరైనా ఇలా ఆరోపణలు చేస్తే వెళ్ళటం సహజమేనని పేర్కొన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై, అలాగే లోకేష్ పై ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని పేర్కొన్నారు జెసి దివాకర్ రెడ్డి.
చాలామంది నాయకులు టిడిపిలో ఉంటే లాభం లేదనే భావనతో పార్టీ వీడి వెళుతున్నట్లుగా పేర్కొన్నారు. అధికార పార్టీలో ఉంటే ఉపయోగం ఉంటుందన్న భావనతో చాలామంది పార్టీ మారే ఆలోచన చేస్తుంటారని జెసి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. జెసి దివాకర్ రెడ్డి సైతం పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న వేళ తనపై పార్టీ మారడానికి ఎలాంటి ఒత్తిడి లేదని, తమ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలాగే తాజాగా తన మాజీ పీఏ ఇంటిపై ఏసీబీ దాడి చేయించారని పేర్కొన్నారు.

Recommended Video
వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్ళి తాను కలిసి తన సమస్యల గురించి చెప్పుకోవలసిన అవసరం లేదని, గతంలోనూ చేయలేదని, ఇకముందు చేయబోనని జెసి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి వల్లభనేని వంశీ వ్యవహారం టిడిపిల దుమారం రేపుతుంది. టిడిపిలో ఉన్న నేతలందర్నీ వంశీ వ్యాఖ్యలు షాక్ కు గురి చేస్తున్నాయి.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications