48వ రోజుకు రాజధాని నిరసనలు..24 గంటల దీక్షకు రైతులు
ఏపీలో రాజధానిఅమరావతి కోసం పోరాటం సాగుతూనే ఉంది . రాజధాని అమరావతిని కాపాడాలని అమరావతి రైతులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. మరోపక్క ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణకు అధికారికంగానే అడుగులు వేస్తున్న పరిస్థితి రాజధాని రైతులకు మరింత ఆందోళన కలిగిస్తుంది.ఇక రాజధాని రైతుల ఆందోళనలు 48వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి.

48వ రోజు కొనసాగుతున్న రిలే దీక్షలు
రాజధాని అమరావతి కోసం వెలగపూడిలో 48వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు రైతులు 24 గంటలకు దీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.నేడు మందడం, వెలగపూడిలోను 24 గంటల దీక్షకు రైతులు కూర్చోనున్నారు. అంతేకాదు ఏపీ సర్కార్ వైఖరిపై ఆగ్రహంతో ఉన్న రాజధాని ప్రాంత రైతులు రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం ఢిల్లీ కి వెళ్లారు రాజధాని ప్రాంత రైతులు .

రాజధానిగా అమరావతి కొనసాగాలని సేవ్ అమరావతి నినాదం.. పట్టించుకోని సర్కార్
ఇక సేవ్ అమరావతి నినాదం రాష్ట్రవ్యాప్తంగా గట్టిగా వినిపిస్తున్నారు రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తున్న వివిధ ప్రాంతాల ప్రజలు. అయినా సర్కార్ మాత్రం మొండిగానే ముందుకు వెళ్ళటం ఏ మాత్రం రుచించటం లేదు. అమరావతికి మద్దతుగా అన్ని చోట్లా ర్యాలీలు, ఆందోళనలు జరుగుతున్నాచూసీ చూడనట్టే వ్యవహరిస్తోంది. 3 రాజధానులపై నిర్ణయం తీసుకున్న వైసీపీ సర్కార్ రైతుల ఆందోళనలు పట్టించుకోకుండా ముందుకే వెళ్తోంది.

రాజధాని కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాం అంటున్న రాజధాని రైతులు
ఈ పరిణామాలపై అమరావతికి భూములిచ్చిన 29 గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు సైతం రాజధాని అమరావతి రైతులకు బాసటగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు .శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమ సహనం పరీక్షించొద్దని అంటున్నారు. రాజధాని అమరావతి కోసం ఎంత కాలం అయినా పోరాటం సాగిస్తామని చెప్తున్నారు. రాజధాని గ్రామాల్లో ఎవర్ని కదిపినా ఉద్వేగానికి లోనవుతున్నారు. తమ భవిష్యత్తో ఆటలాడుతున్న సర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే పోరాటం సాగిస్తున్నారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications