పాచిపోయిన భోజనం,నీళ్ళు కూడా ఇవ్వకుండా .. ఏపీలో కరోనా చికిత్సపై ఓ డిప్యూటీ తహసీల్దార్ ఆవేదన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దారుణ పరిస్థితులను సృష్టిస్తోంది. ఏపీలో కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతున్నామని, ఆసుపత్రులలో వసతుల లేమి లేదని చెప్పిన ఏపీ సర్కార్ కు డిప్యూటీ తహసిల్దార్ వీడియో షాక్ ఇచ్చింది. ఆసుపత్రులలో వసతుల లేమి,డాక్టర్లు పట్టించుకోకపోవడం, కనీసం సమయానికి రోగులకు భోజనం కూడా అందించడం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది.

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో చేరిన డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ
కరోనా మహమ్మారి బారిన పడిన రోగులు ప్రైవేటు ఆసుపత్రులలో డబ్బులు కట్టినా సరైన వైద్య సహాయం అందడం లేదని వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ తాను అనుభవించిన బాధను సెల్ఫీ వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు రోజుల క్రితం వజ్రపు కొత్తూరు డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణకు, ఆయన తల్లి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారిద్దరూ చేరారు. ఆసుపత్రిలో డబ్బులు కట్టి చేరినా కూడా తమకు కనీసం వైద్యం కూడా చేయడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు.

పాచిపోయిన భోజనం పెడుతున్నారు, మంచి నీళ్ళ కూడా ఇవ్వకుండా ఇబ్బందులు అంటూ వీడియో
తన తల్లికి కనీసం సెలైన్ కూడా పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీళ్ల కోసం పదేపదే అడుగుతున్నా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడంలేదని డిప్యూటీ తహసీల్దార్ తన బాధను వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పాచిపోయిన భోజనాన్ని రోగులకు అందిస్తున్నారని, భోజనం కూడా పదే పదే అడిగితేనే పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇక అర్ధరాత్రి 12 గంటలకు భోజనం పెడుతున్నారని పేర్కొన్నారు.ఆసుపత్రులలో దారుణంగా మారిన పరిస్థితులపై వీడియో సందేశాన్ని పంపిన మురళీకృష్ణ, తన సందేశాన్ని స్థానిక మీడియాకు పంపించారు.

వైరల్ గా వీడియో .. జగన్ సర్కార్ కరోనా బాధితుల ఆవేదనపై ఏమంటారో?
దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. డబ్బులు కట్టినా కూడా ప్రైవేట్ ఆసుపత్రులలో సరైన వైద్యం అందడం లేదని, తనలాంటి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మురళీకృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రులలో కరోనారోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్తున్న జగన్ సర్కార్ కరోనా బాధితుల ఆవేదనపై ఏమంటారో తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది .
Recommended Video

ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనలో జగన్ సర్కార్ ఫెయిల్
ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న కరోనా రోగులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూడా జగన్ సర్కార్ ఫెయిల్ అయిందని ఈ వీడియో ద్వారా స్పష్టమవుతుంది.ఇలాంటి పరిస్థితులు ఆస్పత్రులలో ఉంటే, చాలామంది కరోనా బాధితులు ఆసుపత్రులకు వెళితే ఆర్థిక స్తోమత లేక, ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేక కరోనా మహమ్మారికి బలైపోతున్నారు.కరోనా సెకండ్ వేవ్ లో సామాన్యులే ఎక్కువశాతం బలైపోతుండడం గమనార్హం.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications