పెళ్లాడతానని.. ప్రియురాలిపై ఫ్రెండ్స్తో కలిసి రేప్ చేశాడు
హైదరాబాద్: పదిహేనేళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ దుర్మార్గుడు, తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో ఈ విషయాన్ని బాధితురాలి తల్లి దక్షిణ మండలం డిసిపి దృష్టికి తీసుకెళ్లింది.
డిసిపి
ఆదేశాల
మేరకు
పోలీసులు
కేసు
నమోదు
చేసుకుని
దర్యాప్తు
ప్రారంభించారు.
పోలీసుల
కథనం
ప్రకారం..
హఫీజ్బాబానగర్లోని
డి-బ్లాక్కు
చెందిన
ఓ
అమ్మాయి(15),
చాంద్రయణగుట్ట
సమీపంలోని
హాషిమాబాద్కు
చెందిన
అష్రఫ్(20)
ప్రేమించుకున్నారు.
పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని నమ్మించి ఆగస్టు 5న తాను నివసించే సమీప ప్రాంతానికి తీసుకెళ్లాడు అష్రఫ్. అక్కడ స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆగస్టు 18న అమ్మాయి తల్లికి తెలిసింది.
బాధితురాలితో పాటు ఆమె తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. ఘటన జరిగిన ప్రాంతం తమ ఠాణా పరిధిలోకి రాదని కేసు నమోదు చేసేందుకు వారు నిరాకరించారు. దీంతో ఆమె డిసిపి సర్వశ్రేష్ఠ త్రిపాఠి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లింది. డిసిపి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ రమేష్ తెలిపారు.