కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రేయసి హత్య: భార్యను ముక్కలుగా నరికి చెత్తకుప్పలో

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: జిల్లాలోని అల్లూరులో దారుణం జరిగింది. తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలిసి.. ఓ యువకుడు ఆమెను హత్య చేశాడు. ఇంజనీరింగ్ చదువుతున్న పద్మప్రియ(22) తోటి విద్యార్థి తిరుమల కుమార్‌ను ప్రేమించింది. అయితే స్వప్నకు ఆమె తల్లిదండ్రులు మరో సంబంధం చూశారు.

జులై 14వ తేదీన ఆమెకు వివాహం నిశ్చయించారు. విషయం తెలుసుకున్న తిరుమల కుమార్, స్వప్నను మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేశాడు. కుమార్తె కనిపించకపోవడంతో స్వప్న తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు.

తిరుమల కుమార్‌ను విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

A man allegedly murdered his lover

భార్యను ముక్కలుగా నరికి చెత్తకుప్పలో వేశాడు

తూర్పుగోదావరి: జిల్లాలోని కాకినడాలో అనుమానంతో తన భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి సమీపంలోని చెత్తకుండీలో పడేశాడు.

మరో ఘటనలో కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండలం గంజహళ్లిలో దారుణం జరిగింది. తమ్ముడు, మేనమామ కొడుకు కలిసి అక్కను దారుణంగా హత్య చేసి ఆపై పూడ్చిపెట్టారు. విషయం తెలిసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 16 మహిళ అదృశ్యమైనట్లు తెలుస్తోంది.

English summary
A man allegedly murdered his lover on Thursday in Alluru village in Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X