వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంత్రీ: భార్య, ఇద్దరు పిల్లలున్నారు, ఇంటర్ విద్యార్థినితో పరారీకి ప్రయత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

కాకినాడ‌: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం పి. వేమవరానికి చెందిన మైనర్‌ బాలికను మోసం చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన శెట్టి గోవిందరాజును అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మంగళవారం తిమ్మాపురం పోలీస్ స్టేషన్‌లో రూరల్‌ సీఐ పవన్‌ కిశోర్‌ తెలిపారు.

ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో గోవిందరాజు మోసగించినట్లు ఆగస్టులో బాలిక తల్లిదండ్రులు బాల, ఏడిద సుభాకరరావు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అప్పట్లో అతడిపై కేసు నమోదు చేశామని చెప్పారు గోవిందరాజులు వృత్తి రీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నట్టు తెలిపారు.

మంగళవారం బాలికతో కలిసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న తిమ్మాపురం ఎస్‌ఐ సత్యనారాయణ, సిబ్బందితో కలిసి గోవిందరాజును అరెస్ట్‌ చేసి, మైనర్‌ బాలికను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.

A married man tries to elope with minor girl

గోవిందరాజులకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. తనను తన మేనమామ కూడా వేధిస్తున్నట్టు బాలిక ఈ క్రమంలోనే ఆరోపించింది. పోలీసులు మొదట ఫిర్యాదు చేసినప్పుడే ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేసి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదని స్టేషన్‌ ముందు బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

ఈ కేసులో బాలిక తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. బాలికను చైల్డ్‌ హోంకు తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు.

English summary
A man Govinda rajulu has been nabbed by police, while trying to elope with an Intermediate girl student in East Godavari district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X