సిగరెట్లపై ట్యాక్సులు తగ్గించండి ప్లీజ్.. కేంద్రమంత్రికి షాకింగ్ విజ్ఞప్తి
పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం. పొగతాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది అని పదేపదే ఊదరగొడుతున్న కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపైన అదనంగా జీఎస్టీ ని, ఎక్సైజ్ డ్యూటీని విధించి, పొగ తాగడాన్ని తగ్గించడానికి తనవంతుగా ప్రయత్నం చేసింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ను కలిసి సిగరెట్ల పైన పెంచిన టాక్స్ లు తగ్గించండి అంటూ ఊహించని వినతిని పెట్టారు.
సిగరెట్లపైన ట్యాక్స్ లు
ఆరోగ్యాన్ని పాడుచేసే సిగరెట్ల పైన టాక్స్ లు తగ్గించాలని, ఏపీకి చెందిన వారు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ను ఎందుకు కలిశారు.. వారి విజ్ఞప్తి వెనుక అసలు కారణం ఏంటి? అంటే కేంద్రం డిసెంబర్ 31వ తేదీన సిగరెట్ల పై జిఎస్టి 28 శాతం నుంచి 40 శాతానికి పెంచుతున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కొత్త పన్ను ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమలులోకి వస్తుందని పేర్కొంది.

కేంద్రమంత్రిని కలిసిన ఏపీ పొగాకు రైతులు
ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పొగాకు రైతులు ధరలు పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే fcv పొగాకు ధర కిలోకు 60 నుండి 70 రూపాయలు మేర తగ్గిందని, కేంద్ర నిర్ణయంతో భవిష్యత్తులో పొగాకు రైతులు మరింత కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన వారంతా కేంద్ర మంత్రిని కలిశారు.
నిర్మలా సీతారామన్ కు వినతి పత్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పొగాకు రైతులు సిగరెట్ల పై కేంద్రం అదనంగా విధించిన జిఎస్టి, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని కోరుతూ బిజెపి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి తో పాటు వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ పన్నుల పెంపు తమ పొగాకు ఉత్పత్తుల అమ్మకాల పైన, పరిశ్రమ పైన తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
పన్నుల పెంపుతో తమ నష్టాలపై ఆవేదన
పన్నుల పెంపు వల్ల పొగాకు సాగు చేసేవారు, ఆధారపడిన వేలాది మంది కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు వివరించారు. పన్నుల పెరుగుదల కారణంగా తమవద్ద ఉన్న పొగాకు నిల్వలను ఎవరు కొనడం లేదని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల వద్ద 40 నుంచి 50 మిలియన్ టన్నుల పొగాకు నిలువ ఉండగా, మార్కెటింగ్ కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మలా సీతారామన్ కు ఎంపీ పురందేశ్వరి విజ్ఞప్తులు
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి అధిక పొగాకు సాగుచేస్తే రాష్ట్రప్రభుత్వాలతో పాటు, పొగాకుబోర్డు, ఇతర భాగస్వామ్య పక్షాలతో కూడా చర్చించి కేంద్రం ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని వారు ఆర్థికశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా రైతులు దేశీయ పరిశ్రమలతోపాటు, ఎగుమతులను బలోపేతం చేసే దిశగా పొగాకు రంగానికి దీర్ఘకాలిక స్థిరత్వం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని తాను నిర్మల సీతారామన్ ను కోరినట్లు తెలిపారు.
సానుకూలంగా స్పందించారన్న బీజేపీ ఎంపీ
దేశంలో సులభ వాణిజ్య వాతావరణంలో పెంపొందించడానికి 1.2 కోట్ల వార్షిక ఆదాయం కలిగిన స్టార్టప్ లకు కూడా పండు మినహాయింపులు ఇవ్వాలని తాను కోరినట్లు బిజెపి ఎంపీ పురందేశ్వరి తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పొగాకు రైతులతో పాటు, తన విజ్ఞప్తి లకు సానుకూలంగానే స్పందించారని ఆమె వెల్లడించారు.
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications