ఆస్తి కోసం .. ఇద్దరు తమ్ముళ్ళను రాళ్ళతో కొట్టి కాలువలో పడేసి ..అనంతపురంలో దారుణం
అనంతపురం జిల్లాలో ఓ యువకుడికి దుర్బుద్ధి పుట్టింది. బాబాయ్ ఇద్దరు కొడుకులను చంపేస్తే బాబాయ్ ఆస్తి కూడా తనకే వస్తుందని భావించిన ఓ యువకుడు అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను, అందులోనూ బాబాయ్ కొడుకులను హతమార్చేందుకు ప్రయత్నం చేశాడు. గార్లదిన్నె మండలం మార్తాడుకు చెందిన రాము తన తమ్ముళ్ళు అని కూడా చూడకుండా ఆస్తి కోసం వారిని కిరాతకంగా చంపే ప్రయత్నం చేశాడు.

బాబాయి కొడుకులను చంపే యత్నం చేసిన అన్న కొడుకు
చిన్నాన్న కొడుకులైన శశిధర్, మోక్షజ్ఞ లు ఇంటిముందు ఆడుకుంటుండగా వారికి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి నమ్మబలికిన రాము వారిని బయటకు తీసుకు వెళ్ళాడు. ఆపై వారిని దారుణంగా హతమార్చడానికి ప్రయత్నించాడు. ఆడుకోడానికి వెళ్ళిన పిల్లలు ఇంటికి ఎంతకూ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారని అనుమానంతో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాము పై అనుమానంతో ప్రశ్నించగా బాబాయ్ కొడుకులను తానే తీసుకెళ్లినట్లు ఒప్పుకున్న రాము అతను చేసిన ఘాతుకాన్ని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

ప్రాణాపాయంలో ఒక బాలుడు ,ఇంకో బాలుడి కోసం గాలింపు
చాక్లెట్లు కొనిస్తానని బయటకు తీసుకు వెళ్లిన రాము బాబాయి కొడుకులను రాళ్లతో కొట్టి కాలువలో పడేసినట్లుగా చెప్పినట్టు సమాచారం . కూడేరు సమీపంలో శశిధర్ ప్రాణాపాయ స్థితిలో కనిపించగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు . ఇప్పటి వరకు మోక్షజ్ఞ జాడ తెలియలేదు. మోక్షజ్ఞ ను హంద్రీ-నీవా కాలువలో పడేసిన ట్లుగా రాము ఒప్పుకున్నాడని సమాచారం . ప్రస్తుతం మోక్షజ్ఞ కోసం పోలీసులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.
Recommended Video

ఆస్తి కోసమే దారుణం .. కేసు నమోదు చేసిన పోలీసులు
ఆస్తి కోసం అన్న కొడుకు చేసిన ఘాతుకాన్ని తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. చిన్నాన్న ఇద్దరు కొడుకులు చనిపోతే, చిన్నాన్న వాటా కింద ఉన్న 10 ఎకరాల పొలం కూడా తనకే వస్తుందని ఆశతో రాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు రాముని అదుపులోకి తీసుకొని ఈ కేసును విచారిస్తున్నారు . అయితే ఈ కేసులో కేవలం ఆస్తి కోసమే రాము ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా ? లేదా మరేదైనా కారణం ఉందా ? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications