ఏపీ సచివాలయంలో భారీ స్కామ్ : ప్రజా ప్రతినిధుల సిబ్బంది పాత్ర : ఏసీబీ అదుపులో అనుమానితులు..!!
ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న భారీ స్కామ్ ను ఏసీబీ గుట్టు రట్టు చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన నిధుల గోల్ మాల్ జరిగినట్లుగా విచారణలో గుర్తించారు. సచివాలయంలోనే పని చేసే కొందరు సిబ్బంది పేదల డేటా సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధులు పక్క దారి పట్టించారని నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో సచివాలయ సిబ్బందితో పాటుగా ప్రజా ప్రతినిధులు పీఏలు .. వారి అనుచరుల పాత్ర పైనా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఆరు నెలల క్రితమే సీఎంఆర్ఎఫ్ అధికారులు ఫిర్యాదు చేసారు.
దీంతో..రంగంలోకి దిగిన ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ చేసింది. నకిలీ బిల్లులను క్రియేట్ చేసి వాటికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేస్తున్నట్లుగా తేల్చారు. ఈ వ్యవహారం లో దాదాపు 50 మంది వరకు ప్రమేయం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది మే నుంచి ఏసీబీ ఈ వ్యవహారం పైన విచారణ ప్రారంభించింది. ఇప్పటికే పలువురు అధికారులు..సిబ్బందిని విచారించారు. అయితే, మరి కొందరు విచారణకు పిలిచినా హాజరు కాలేదు. విడతల వారీగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. గతంలో నోటీసులు ఇచ్చినా హాజరు కాని వారికి ఇప్పుడు ఏసీబీ మరో సారి నోటీసులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇద్దరు కీలక సిబ్బందిని ఏసీబీ అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. కానీ, ఏసీబీ లేదా ప్రభుత్వం నుంచి మాత్రం సిబ్బందిని అదుపులోకి తీసుకున్న అంశం పైన అధికారికంగా నిర్ధారణ కాలేదు. అయితే, ఈ మొత్తం వ్యహారంలో కొందరు ప్రజా ప్రతినిధుల వద్ద పని చేసే సిబ్బంది ప్రమేయం సైతం ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే, వారెవరనేది మాత్రం పేర్లు బయటకు రాలేదు. గతంలో రాయలసీమ జిల్లాలకు చెందిన ఒక ఎమ్మెల్యే వద్ద పని చేసే సిబ్బంది పేరు ప్రచారంలోకి వచ్చింది.
ఇక, ఇప్పుడు సచివాలయంలోనే పని చేస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్మును పక్క దారి పట్టించిన ఇంటి దొంగల పైన ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఈ కేసులో ఏసీబీ కీలక ఆధారాలు సేకరించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ అంశం సచివాలయం అధికారిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దీని వెనుక ఉన్నదెవరు...ఎవరి సహకారంతో జరిగింది.. ఇందులో పాత్ర ధారులు ఎవరనే అంశం పైన ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications