ఘోర ప్రమాదం: టెంపో-ఆర్టీసీ బస్సు ఢీ, ఐదుగురు మృతి

చిత్తూరు: జిల్లాలోని బంగారుపాలెం మండలం కేజీ సత్రం వద్ద బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. టెంపోను కర్ణాటక ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Accident in KG Satram: 5 killed

ప్రమాద సమయంలో టెంపోలో 18 మంది వరకు ఉన్నట్టు సమాచారం. బాధితులను మహారాష్ట్రకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తిరుమల నుంచి మైసూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+