ఫీజుల మంట: రూ.25 కోట్లు బకాయిలు: మోహన్ బాబును రోడ్డెక్కనివ్వని పోలీసులు: హౌస్ అరెస్ట్!
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లింపులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ, ప్రముఖ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ మంచు మోహన్ బాబు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది.
నిర్దేశిత సమయం ప్రకారం.. ఉదయం 9 గంటలకు మోహన్ బాబు తిరుపతి సమీపంలోని రంగంపేట క్రాస్ వద్ద గల శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థ నుంచి విద్యార్థులతో కలిసి నిరసన ప్రదర్శన చేపట్టాల్సి ఉంది. నిరసన ప్రదర్శన కోసం తిరుపతి రూరల్ పోలీసుల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు.
మరో గంటలో ఆయన శ్రీ విద్యానికేతన విద్యాసంస్థకు బయలుదేరాల్సి ఉన్న సమయంలో.. పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. మోహన్ బాబును గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ సమయంలో మోహన్ బాబు వెంట ఆయన కుమారుడు, యువ నటుడు మంచు మనోజ్ ఉన్నారు. ఉదయం 7 గంటలకే పోలీసులు ఆయన నివాసం ఉన్న శ్రీవిద్యానికేతన్ క్యాంపస్ కు చేరుకున్నారు.
Why is The government not paying the students fee? And the rally I want to is for the students. I don’t gain anything from it. 19 crores have been pending and for what? Why isn’t the government honoring their commitment????
— Mohan Babu M (@themohanbabu) March 22, 2019
హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మోహన్ బాబు..నిరసన ప్రదర్శన కోసం తాను అనుమతి కూడా తీసుకున్నానని అన్నారు. ఏ కారణంతో నిర్బంధిస్తారని ప్రశ్నించారు. అయినప్పటికీ- పోలీసులు ఆయనను ఇల్లు కదలనివ్వలేదు. పెద్దఎత్తున మోహరించారు.
సీనియర్స్ వర్సెస్ జూనియర్స్..! ఏపి రాజకీయం రసకందాయం..!!
ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను ఒక్క రూపాయి కూడా అందట్లేదంటూ మోహన్ బాబు ఇదివరకే విమర్శించిన విషయం తెలిసిందే. ఆస్తులు అమ్ముకుని విద్యాసంస్థలను నడిపిస్తున్నామని, ఫీజు రీఎంబర్స్ మెంట్ కింద రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయట్లేదని ధ్వజమెత్తారు. 20 కోట్ల రూపాయల మేర బకాయిలు తమ ఒక్క విద్యాసంస్థకే అందాల్సి ఉందని చెప్పారు.
Wanted to take a peaceful rally today in Tirupathi protesting the non payment of the fee reimbursement of the students by the Govt.... Police have arrived at our home in Tirupathi and looks like they are not going to allow the rally.
— Mohan Babu M (@themohanbabu) March 22, 2019
ఈ విషయంపై తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పలుమార్లు లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. చివరికి- రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయడం తప్ప మరో ఆగత్యం కనిపించలేదని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మోహన్ బాబు నిరసన ప్రదర్శన తల పెట్టడాన్ని చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది. ఓటర్లపై పెను ప్రభావం చూపుతుందనే రాజకీయ కారణంతో.. ప్రభుత్వం మోహన్ బాబును గృహనిర్బంధంలో ఉంచింది.