ఏపీ సచివాలయంలో మళ్లీ లీకేజీ: వర్షపు నీటిని ఎత్తిపోసిన సిబ్బంది..
తాజాగా కురిసిన వర్షాలకు సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న నీటిపారుదల విభాగం కార్యాలయంలోకి నీరు వచ్చి చేరింది.
అమరావతి: వెలగపూడిలోని ఏపీ సచివాలయాన్ని లీకేజీ బెడద వెంటాడుతూనే ఉంది. నెల క్రితం జగన్ ఛాంబర్ లీకేజీతో విమర్శలు మూటగట్టుకున్న ప్రభుత్వం.. దాని వెనకాల కుట్ర దాగుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆపై లీకేజీ వ్యవహారంపై ఓ కమిటీని కూడా నియమించారు.
ఇక తాజాగా కురిసిన వర్షాలకు సచివాలయంలోని 4వ బ్లాక్ లో ఉన్న నీటిపారుదల విభాగం, మంత్రి గంటా శ్రీనివాసరావు యాంటీ రూమ్, మంత్రి దేవినేని ఉమా ఛాంబర్లలో వర్షపు నీరు లీకేజీ అయింది. సోమవారం మధ్యాహ్నాం నుంచి కురుస్తున్న వర్షానికి.. గ్లాస్ విండోల నుంచి, కొన్ని చోట్ల పై ఫ్లోర్ ల నుంచి వాటర్ లీకవుతోంది.

మంత్రి గంటా శ్రీనివాసరావు యాంటీ రూమ్ లో సీలింగ్ తడిసి ఊడిపడింది. జలవనరుల శాఖ విభాగంలో చాలా చోట్ల గోడల వెంబడి వర్షపు నీరు లీకవుతోంది. దీంతో రెవెన్యూ శాఖ సెక్షన్ లో ఉద్యోగుల పనికి ఆటంకం ఏర్పడింది. వర్షపు నీటిని సిబ్బంది బకెట్లతో ఎత్తి పోస్తున్నారు.
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications