టెక్నాలజీతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి: బాలకృష్ణ
వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తేనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సుకు ఆయన ఇతర ఎమ్మెల్యేలు,
విశాఖపట్నం: వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తేనే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సుకు ఆయన ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. రైతులకు ప్రయోజనం కలిగించేలా అగ్రిటెక్ సదస్సు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

వినూత్నమైన సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. కాగా, గురువారం మంత్రి లోకేష్, ఉమామహేశ్వరరావు, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి బాలకృష్ణ పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ్నుంచి నేరుగా గురువారం సాయంత్రం విశాఖపట్నంకు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications