ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : బుధవారం గ్రూప్-2 నోటిఫికేషన్!
విజయవాడ : ప్రభుత్వోద్యాగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇదో గుడ్ న్యూస్. నేటి రాత్రి గానీ లేదా బుధవారం నాడు గానీ ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల అవబోతుంది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ స్వయంగా వెల్లడించారు.

ఆరు నెలల్లోనే గ్రూప్-2కు సంబంధించిన అన్ని ప్రక్రియలను పూర్తి చేస్తామని ధీమాగా చెబుతున్నారు ఉదయ్ భాస్కర్. తాజా నోటిఫికేషన్ ద్వారా 950 నుంచి వెయ్యి పోస్టుల వరకు భర్తీ అవనున్నాయి. ఇక వచ్చే డిసెంబర్ లోగా గ్రూప్-3, గ్రూప్-1 నోటిఫికేషన్లను కూడా విడుదల చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రూప్-2 నోటిఫికేషన్ నిరుద్యోగులందరిలో కొత్త ఆశలు చిగురింపజేసేదిగా మారింది.












Click it and Unblock the Notifications