వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీలో పాగాకు అమిత్ షా: కిషన్ కొత్త నినాదం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ లక్ష్యంలో భాగంగా తెలంగాణపై బీజేపీ జాతీయ విభాగం కసరత్తు ప్రారంభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దక్షిణ భారత దేశంలో తొలి పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ వస్తున్నారు. గ్రామస్థాయి నుండి పార్టీని పటిష్టపరచడమే లక్ష్యంగా ఆయన రెండు రోజుల పాటు అందరితో సమావేశమవుతారు.

యూపీలో బీజేపీకి అత్యుత్తమ ఫలితాలు అందించిన నాయకుడిగా, వ్యూహనిపుణుడిగా గుర్తింపు పొందిన అమిత్ షా పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, అమిత్ షా తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న అమిత్ షాకు కంటోన్మెంటులోని ఇంపీరియల్ గార్డెన్‌లో స్వాగత, సన్మాన సభ ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి బుధవారం తెలిపారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ హఠావో.. బీజేపీ జీతావో.. హైదరాబాద్ బచావో.. అనే నినాదంతో తాము ఎన్నికలకు వెళ్తామన్నారు.

 కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

అమిత్ షా తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న అమిత్ షాకు కంటోన్మెంటులోని ఇంపీరియల్ గార్డెన్‌లో స్వాగత, సన్మాన సభ ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి బుధవారం తెలిపారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

ఇంపీరియల్ గార్డెన్‌లో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, తదితరులు పరిశీలించారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి మోడీ రాషాట్రంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన చోట నుండే అమిత్ షా కూడా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుండటం విశేషమని కిషన్ రెడ్డి అన్నారు.

కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి

రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ హఠావో.. బీజేపీ జీతావో.. హైదరాబాద్ బచావో.. అనే నినాదంతో తాము ఎన్నికలకు వెళ్తామన్నారు.

English summary
Newly-elected BJP national president Amit Shah, who will be in the city on Thursday for his maiden two-day visit, is expected to provide a much-needed direction to the Telangana BJP, besides clarifying the party’s stand vis-a-vis the Telugudesam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X