దుమ్ము రేపుతున్న అనకాపల్లి ఉత్సవం.. మొదలైన సంబరం!
అనకాపల్లి ఉత్సవ్.. ఏపీ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవం. ఈ ఉత్సవాన్ని అచ్చుతాపురం మండలం కొండకర్ల ఆవ వద్ద ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర, శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, పార్లమెంట్ సభ్యులు సి.ఎం. రమేష్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించి, ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో-విజువల్ పాటను ఆవిష్కరించారు.
పర్యాటకులను ఆకట్టుకుంటున్న బోట్ షికార్
అనకాపల్లి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా కొండకర్ల ఆవలో ఏర్పాటు చేసిన బోటు షికారు పర్యాటకులను ఆకట్టుకుంది. బొమ్మల వేషాలు, తప్పెటగుళ్లు, సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ అనకాపల్లి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సృజనాత్మక పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఏర్పాటు చేసిన ఏటికొప్పాక బొమ్మల తయారీ, చెక్కతో కళాఖండాల తయారీ, సవర పెయింటింగ్, వాటర్ కలర్స్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ ఆకట్టుకుంటున్నాయి.

మూడురోజుల అనకాపల్లి ఉత్సవ్
ఫోటోగ్రఫీ, కుండలపై బొమ్మలు వేయుట, మత్స్యకార వస్తువుల తయారీ, మట్టి బొమ్మలు, కుండల తయారీ, సంప్రదాయ పెయింటింగ్ వంటి అంశాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లలో ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవ్ ను ఏపీ సర్కార్ అత్యంత ఘనంగా నిర్వహించనుంది.
అనకాపల్లి ఫేమస్ వస్తువుల స్టాల్స్: ఉత్సవాన్ని ప్రారంభించిన శాసనసభ స్పీకర్
అలాగే జిల్లాలోని స్థానిక ఉత్పత్తులైన మాడుగుల హల్వా, అరకు కాఫీ, గిరిజన ఉత్పత్తులు, స్థానిక సంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన స్టాళ్లు పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.ఇక రెండురోజుల పాటు సాగే ఈ ఉత్సవాన్ని ప్రారంభించిన శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కొండకర్ల ఆవ దేశంలోనే రెండవ అతిపెద్ద సహజ సిద్ధ సరస్సు అని పేర్కొన్నారు.
విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా కొండకర్ల అభివృద్ధి
జిల్లాలోని రిజర్వాయర్లను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా కొండకర్లను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.పర్యాటకం వృద్ధి చెందితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని శాసన సభ స్పీకర్ అన్నారు. ప్రతి ఒక్కరూ వారంలో ఒక రోజు కుటుంబంతో గడపాలని, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో తొలిసారి అనకాపల్లి ఉత్సవాలు: మంత్రి కొల్లు రవీంద్ర
జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా అనకాపల్లి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాలకు పర్యాటక గుర్తుంపు వచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
విశాఖ ఉత్సవాలతో పాటు అనకాపల్లి, అరకు ఉత్సవాలు
విశాఖ ఉత్సవాలతో పాటు అనకాపల్లి, అరకు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అనకాపల్లి జిల్లాలో టూరిజం అభివృద్ధికి అనేక వనరులు, ఆలయాలు, పురాతన కట్టడాలు ఉన్నాయన్నారు. కొండకర్లను విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. పర్యాటక అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications