Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోనసీమలో వైసీపీ సర్కార్ కు మరో టెన్షన్- రైతుల క్రాప్ హాలిడే-2011 తర్వాత ఇదే తొలిసారి

ఏపీలోని కోనసీమ ప్రాంతంలో రైతుల సమస్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభుత్వం వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. దీంతో విరక్తి చెందిన రైతులు ఈ ఏడాది పంటలు వేయకుండా క్రాప్ హాలిడే పాటించాలని నిర్ణయించారు. ఈ మేరకు కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుతో కోనసీమలోని 12 మండలాల రైతులు క్రాప్ హాలిడేకు సిద్ధమయ్యారు.

 కోనసీమలో మరో క్రాప్ హాలిడే

కోనసీమలో మరో క్రాప్ హాలిడే

కోనసీమ జిల్లాలోని 12 మండలాల్లో క్రాప్ హాలిడే పాటించాలని కోనసీమ రైతు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. గత నెలలో రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా అధికార యంత్రాంగం పట్టించుకోక పోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు క్రాప్ హాలిడే కు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకున్న రైతులు.. ఈ మేరకు తాజాగా క్రాప్ హాలిడే తప్పనిసరిగా భావించారు. దీంతో వారు పంటలు వేయకూడదని తీర్మానాలు చేసుకుంటున్నారు.

Recommended Video

    YSR Yantra Seva Scheme రైతుకు అండగా ఉన్నామన్న AP CM Jagan *AndhraPradesh | Telugu Oneindia
    క్రాప్ హాలిడే వెనుక?

    క్రాప్ హాలిడే వెనుక?

    ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం,ఎరువులు, సాగు ఖర్చులు పెరిగిపోయి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు.పంట కాలువలు, డ్రైన్ల నిర్వహణ సక్రమంగా లేక వర్షాకాలంలో పంట చేలు ముంపుకు గురవుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఇప్పటికే ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని తొలకరి పంట వేయకూడదని తీర్మానాలు చేసుకున్నారు.

    2011 తర్వాత ఇదే

    2011 తర్వాత ఇదే

    వరిసాగు గిట్టుబాటు కాక గతంలో 2011లో కోనసీమ రైతులు క్రాప్ హాలిడే పాటించారు. అయితే రైతు సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదు. అప్పటితో పోలిస్తే రైతుల సమస్యలు మరింతగా పెరిగాయి. దీంతో ఆగ్రహంగా ఉన్న రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా స్ధానిక అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విసిగిపోయిన కోనసీమ రైతులు మరోసారి క్రాప్ హాలిడే కు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందిస్తే వారు ఆలోచించే అవకాశాలూ లేకపోలేదు.

    టీడీపీ కుట్రేనన్న విశ్వరూప్

    టీడీపీ కుట్రేనన్న విశ్వరూప్

    క్రాప్ హాలిడే పేరుతో ప్రభుత్వంపై బురద చల్లడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోందని ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు.కోనసీమ రైతులు ఎవరు కూడా ఏవిధమైన ప్రలోభాలకు లోనవ్వకుండా క్రాఫ్ హాలిడే ను ఖండించాలని మంత్రి విశ్వరూప్ పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో కనీసం సమావేశాలు కూడా ఏర్పాటు చూసుకొనివ్వలేదని, ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్న రైతు నాయకులందరూ కూడా టీడీపీ హయాంలో రోడ్డెక్కలేదని ఆయన విమర్శించారు. రైతులు రైతుల్లా ఉండాలి కాని పార్టీ కార్యకర్తల్లా ఉండకూడదని మంత్రి విశ్వరూప్ హితవు పలికారు.

    కోనసీమ రైతులకు 24 గంటలలో ధాన్యం బకాయిలు చెల్లిస్తామన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+