మురిసిన బాబు, అరుదైన అవకాశం: అమరావతిలో 'నాగార్జున' పాత్ర
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కళాశాల సాంకేతిక సహకారం అందించనుంది. ఇటీవల కృష్ణా పుష్కరాల నేపథ్యంలో బందర్ రోడ్డులో 8 కి.మీ. పొడవున విద్యార్థులు ప్రహరీ గోడలకు అందమైన పెయింటింగ్ చిత్రాలు వేశారు.
ఇవి చంద్రబాబును ఆకట్టుకున్నాయి. నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులను ప్రశంసించారు. వారిలో ఎంతో సృజనాత్మకత ఉందని వారి సేవలను అమరావతి నిర్మాణాల్లో కూడా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.

ఈ నెల 22న మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ఇతర అధికారులు నాగార్జున విశ్వవిద్యాలయ ఆర్కిటెక్చర్ కళాశాలకు వెళ్లి.. విద్యార్థులు, అధ్యాపకులు, ఉన్నతాధికారులతో మాట్లాడారు. అమరావతిలో తలపెట్టిన రాజధాని నిర్మాణ పనుల్లో విద్యార్థులు, అధ్యాపకుల సేవలను వినియోగించుకుంటామన్నారు.
ఈ మేరకు ఎంఓయూ చేసుకోవాలని నిర్ణయించారు. బుధవారం జరగాల్సిన ఈ ప్రక్రియ వాయిదా పడింది. సోమవారం ఈ ఒప్పందం ఉంటుందని తెలుస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన డిజైన్లతో సహా ప్రతిదీ చైనా, సింగపూర్ కంపెనీలు అందిస్తున్నాయి. అయితే తొలిసారిగా రాష్ట్రానికి చెందిన ఒక ప్రభుత్వ విద్యా సంస్థ సహకారాన్ని రాజధాని నిర్మాణంలో కోరటం గమనార్హం. ఇది అరుదైన అవకాశం.
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మరో పథకం అమలుకు నిర్ణయం..!! -
నిరుద్యోగులకు ఉగాది కానుక, 10వేల ఉద్యోగాలు భర్తీ- ఏ శాఖలో ఎన్ని..!! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్












Click it and Unblock the Notifications