వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో రేపటి నుంచి బ్యాంకు పనివేళల్లో మార్పు- ఈ నెల 20 వరకు సమయాలివే

|
Google Oneindia TeluguNews

ఏపీలో రేపటి నుంచి బ్యాంకుల పనివేళలు మారనున్నాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో రేపటి నుంచి జనజీవన కార్యకలాపాలకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ తాజా వేళలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు పనివేళలను అందుకు అనుగుణంగా సవరించారు.

Recommended Video

APSFL To Expand Services, రాబోయే రోజుల్లో 8608 కనెక్షన్లు || Oneindia Telugu

ఇప్పటివరకూ రాష్ట్రంలో బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకే పనిచేస్తుండగా.. ఇప్పుడు దాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచారు. అయితే, బ్యాంకుల సిబ్బంది తమ పరిపాలనా విధుల నిమిత్తం సాయత్రం 5 గంటల వరకు బ్యాంకుల్లోనే ఉండనున్నారు. ఈ మేరకు బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేయాలని ఎస్ఎల్బీసీ సమావేశంలో నిర్ణయించారు. ఏపీలో జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగించిన నేపథ్యంలో అప్పటివరకూ ఈ సమయాలు అమల్లో ఉంటాయి.

ap banks to work from 10am to 2pm from tomorrow in wake of curfew exemptions

ఏపీలో కరోనా నేపథ్యంలో బ్యాంకులు పూర్తిస్ధాయిలో సేవలు అందించడం లేదు. ప్రస్తుతం అత్యవసర సేవలు, రోజువారీ సేవల కోసం మాత్రమే బ్యాంకులు పనిచేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో పరిమిత సిబ్బందితో పనిచేస్తుండటమే ఇందుకు కారణం. అయితే ప్రభుత్వం కర్ఫ్యూ మినహాయింపులు పెంచిన నేపథ్యంలో బ్యాంకుల పనివేళలతో పాటు సేవల్ని కూడా మార్చాలని బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తాజా వేళలు అందుబాటులోకి రానున్నాయి.

English summary
andhrapradesh bankers association on today decided to extend bank working hours in ap from 10am to 2pm from tomorrow in wake of state govt's new curfew exemptions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X