Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ కేబినెట్ భేటీ : సీపీఎస్ - మూడు రాజధానుల పై నిర్ణయం..!!

కీలక అంశాలపైన నిర్ణయం దిశగా ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. వచ్చే వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకుంది .ఈ క్రమంలో ఈ నెల 12 లేదా 19వ తేదీ నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీని పైన ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక.. మూడు రాజధానుల అంశం పైన హై కోర్టు తీర్పుపై న్యాయ పరంగా ఎలా ముందుకెళ్లాలో ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటోంది.

మూడు రాజధానులపై ఏం చేద్దాం

మూడు రాజధానులపై ఏం చేద్దాం

వీటిని మంత్రివర్గంలో చర్చించి.. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లోగా మూడు రాజధానుల ప్రక్రియ పూర్తి చేస్తామని తాజాగా మంత్రి అమర్ నాధ్ స్పష్టం చేసారు. దీంతో.. ముందుగా ముఖ్యమంత్రి విశాఖ కేంద్రంగా తన క్యాంపు కార్యాలయం నుంచి త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, సీపీఎస్ రద్దు అంశం ఇప్పుడు ప్రభుత్వానికి సమస్యగా మారింది. 2019 ఎన్నికల ముందు సీపీఎస్ రద్దు పైన ఇచ్చిన హామీ నిలబెట్టు కోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నాయి.

సీపీఎస్ వ్యవహారం పైనా నిర్ణయం

సీపీఎస్ వ్యవహారం పైనా నిర్ణయం

ఈ సమయంలోనే ప్రభుత్వం జీపీఎస్ పైన ప్రస్తావన చేస్తోంది. దీనికి ఉద్యోగ సంఘాలు ససేమిరా అంటున్నాయి. ప్రభుత్వం సీపీఎస్ స్థానంలో పదవీ విరమణ తరువాత గ్యారంటీ పెన్షన్ స్కీం పైనే మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తాజాగా ఉపాధ్యాయ దినోత్సవ సభలోనూ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ కేబినెట్ సమావేశంలో దీని పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అదే విధంగా.. ఇప్పటికే వచ్చే ఎన్నికలకు మందుస్తుగా సమాయత్తం అవ్వటంలో భాగంగా.. గడప గడపకు ప్రభుత్వం పైన సీఎం తాజా పరిస్థితిని వివరించే అవకాశం ఉంది. అదే విధంగా అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలోనే..జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు చెబుతున్నారు.

అసెంబ్లీ సమావేశాలు - పొత్తు రాజీకీయం

అసెంబ్లీ సమావేశాలు - పొత్తు రాజీకీయం


ఇప్పటికే ఎమ్మెల్యేలకు డెవలప్ మెంట్ ఫండ్స్ తో పాటుగా సచివాలయాల వారీగా నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరోసారి సీఎం జగన్ మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇక..ఏపీలో ప్రతిపక్ష పార్టీల పొత్తుల అంశం పైన అధికారిక అజెండా ముగిసిన తరువా రాజకీయంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు కలిసినా...వైసీపీ ఒంటరిగానే ముందుకెళ్లేందుకు సిద్దం అవుతుంది. ఇదే విషయం పైన సీఎం జగన్ తాజా రాజకీయాల పైన మంత్రులకు దిశా నిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+