జనం తిరుగుబాటు చేయాలి..టీడీపీ నేతల తీరుపై విసిగిపోయిన చంద్రబాబు ..!
ఏపీలో గత వైసీపీ సర్కార్ హయాంలో ఇసుక, మద్యం అక్రమాలపై కూటమి పార్టీల నేతలు నిత్యం పోరాటాలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే ఇసుక, మద్యం అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పి ఓట్లు కూడా వేయించుకున్నారు. ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక అవే ఇసుక, మద్యం అక్రమాల్లో ఆయా పార్టీల నేతలే మునిగితేలుతున్నారు. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు స్వయంగా సీఎం చంద్రబాబే తరచుగా చెప్తున్నారు.
తాజాగా కూటమి ప్రభుత్వం మద్యం, ఇసుక విధానాలను అమల్లోకి తెచ్చింది. వీటిని కచ్చితంగా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అధికార పార్టీల నేతలే వీటికి తూట్లు పొడవడం మొదలుపెట్టేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారు చేస్తున్న దందాలు ఏ స్ధాయిలో ఉన్నాయంటే వీటిపై స్వయంగా సీఎం చంద్రబాబే జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. వీరికి పదే పదే హెచ్చరికలు చేయాల్సి వస్తోంది. తాజాగా ఇవాళ మరోసారి సీఎం చంద్రబాబు ఇలాంటి హెచ్చరికలే చేశారు.

ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ సొంత పార్టీ నేతల్ని చంద్రబాబు హెచ్చరించారు. ఎవరైనా ఇసుక దందా చేస్తే జనం తిరుగుబాటు చేయాలంటూ ఓ సలహా కూడా ఇచ్చారు. మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్నారు. మద్యం, ఇసుక విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, రూపాయి కూడా అవినీతి జరగడానికి వీల్లేదని మరోసారి తేల్చిచెప్పేశారు.అంతే కాదు గీత దాటితే ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications