కరువు సమావేశం నిధుల కోసం కాదు: మానవ తప్పిదాలే కారణమన్న చంద్రబాబు
న్యూఢిల్లీ: ప్రణాళిక బద్దంగా వ్యవహరిస్తే కరువుని ఎదుర్కొవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ సమస్యలపై ప్రధాని నరేంద్రమోడీని కలిసిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కరువు నివారణంపై రాష్ట్రంలో తీసుకున్న చర్యలను ప్రధానికి వివరించామన్నారు.
12 అంశాలతో కూడిన డిమాండ్లు ప్రధాని ముందు ఉంచామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కరవు ఎదుర్కొనేందుకు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లక్ష్యాలు నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. గత పదేళల్లో భారత్ లో సంభవించిన తుపానులన్నింట్లో హుదూద్ పెద్దదని మోడీ చెప్పారని ఆయన తెలిపారు.













Click it and Unblock the Notifications