వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కోవిడ్‌ హెల్త్‌ బులిటెన్‌- టెస్టులు పెరిగాయ్‌- కేసులూ పెరిగాయ్‌-24 గంటల్లో 21K

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేసుల ప్రవాహం మాత్రం ఆగడం లేదు. కర్ఫ్యూ విధించినా దాని ప్రభావం ఏమాత్రం ఉండటం లేదు. దీంతో గత 24 గంటల్లో 21 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు 99 మరణాలు కూడా చోటు చేసుకున్నాయి. మొన్నటితో పోలిస్తే నిన్న కరోనా టెస్టుల సంఖ్య పెరగడంతో కేసుల సంఖ్యపైనా ఆ ప్రభావం కనిపించింది.

ఏపీలో ప్రభుత్వం తాజాగా ప్రకటించిన హెల్త్ బులిటెన్‌ ప్రకారం గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2923 కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత స్ధానాల్లో అనంతపురం 2804, చిత్తూరు 2630, విశాఖ 2368 ఉన్నాయి. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 785 కేసులు నమోదుకాగా.. ఆ తర్వాత విజయనగరంలో 965, కర్నూల్లో 991, కడపలో 1036, నెల్లూరులో 1251, గుంటూరులో 1291, శ్రీకాకుళంలో 1466, పశ్చిమగోదావరిలో 1762 కేసులు నమోదయ్యాయి.

ap covid 19 health bulletin : 21k new cases, 99 deaths in last 24 hours

ఇప్పటివరకూ రాష్ట్రంలో 14.75 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇందులో 12.54 లక్షల మంది కోలుకున్నారు. మరో 2.11 లక్షల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో 9580 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కరోనాతో 99 మంది చనిపోయారు. ఇందులో అత్యధికంగా చిత్తూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పన చనిపోగా.. తూర్పుగోదావరి, ప్రకాశంలో తొమ్మిది మంది చొప్పున, అనంతపురం, గుంటూరు, విశాఖ, పశ్చిమగోదావరిలో 8 మంది చొప్పున మృత్యువాత పడ్డారు. కర్నూలు, శ్రీకాకుళంలో ఆరుగురు చొప్పన, నెల్లూరులో ఐదుగురు, కడపలో ఇద్దరు మరణించారు.

English summary
there is a slight increase in covid 19 cases in andhra pradesh as the number of tests also increased for last 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X