ఏపీ కరోనా అప్డేట్ : మరోసారి 6 వేల కేసులు- తూర్పులోనే వెయ్యి- 58 మరణాలు
ఏపీలో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య 6 వేలకు కాస్త అటు ఇటుగా ఉంటోంది. గత 24 గంటల్లో మరోసారి 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 58 మంది చనిపోయారు. 24 గంటల్లో లక్షకు పైగా పరీక్షలు నిర్వహించింది. అలాగే 7728 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ బులిటెన్ పేర్కొంది.
గత 24 గంటల్లో ఏపీలో 6151 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరిలోనే 1244 కొత్త కేసులు వెలుగుచూశాయి. మిగతా జిల్లాల్లో చిత్తూరులో 937, పశ్చిమగోదావరిలో 647, ప్రకాశంలో 554, కడపలో 478, కృష్ణాలో 424 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్ని పరిశీలిస్తే అనంతపురంలో 359, గుంటూరులో 331, నెల్లూరులో 274, శ్రీకాకుళంలో 264, విశాఖలో 237, కర్నూల్లో 203, విజయనగరంలో 199 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం 18.32 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో 17.50 లక్షల మంది కోలుకున్నారు. మరో 69 వేల యాక్టివ్ కేసులున్నాయి.
మరణాల విషయానికొస్తే గత 24 గంటల్లో 58 మంది కరోనాతో చనిపోయారు. ఇందులో అత్యధికంగా చిత్తూరులో 12 మంది, ప్రకాశంలో ఏడుగురు, గుంటూరులో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, అనంతపురంలో నలుగురు, కృష్ణాలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విశాఖలో ముగ్గురు, కర్నూల్లో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు మరణించారు. వీరితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 12167కు చేరింది.