కర్ణాటకలో బిజెపికి వ్యతిరేకంగా ఓటేసి తెలుగోడి సత్తా చూపాలి: ఏపీ డిప్యూటీ సీఎం కెఈ
బెంగుళూరు:ఏపీకి నష్టం చేసిన బిజెపికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం కె.ఈ. కృష్ణమూర్తి కర్ణాటక రాష్ట్రంలోని తెలుగు ప్రజలను కోరారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వాడి సత్తాను చూపాలని ఆయన పిలుపునిచ్చారు.
కర్ణాటకలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం కె.ఈ కృష్ణమూర్తి మీడియాతో మాల్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకైనా ఓటేయ్యండి కానీ, బిజెపికి మాత్రం ఓటేయ్యకూడదని కెఈ కృష్ణమూర్తి కర్ణాటకలోని తెలుగు ప్రజలను కోరారు.

కర్ణాటక ఎన్నికల్లో బిజెపిని ఓడించి తెలుగు ప్రజల సత్తాను చూపాలని ఆయన కోరారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు ప్రజలకు మోడీ అన్యాయం చేశారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారు.త్వరలో జరిగే కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మినహ ఏ పార్టీకైనా ఓటేయాలని ఆయన తెలుగు ప్రజలను కోరారు.రానున్న రోజుల్లో ఉత్తర, దక్షిణాది ప్రాంతాలంటూ గొడవలు వచ్చే అవకాశం కూడ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications