అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంసెట్ ఫలితాలు విడుదల, 12 నుంచి కౌన్సెలింగ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం కాకినాడ జేఎన్‌టీయలో మంత్రి గంటా శ్రీనివాస్‌రావు, కామినేని శ్రీనివాస్‌ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ విభాగాలకు సంబంధించిన మార్కులు, ర్యాంకులను వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ అనుకున్నదాని కంటే 5రోజుల ముందుగానే ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేసినట్లు చెప్పారు. వచ్చె నెల 12 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 24 నుంచి ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

Ganta srinivasarao

ఇంజనీరింగ్ విభాగంలో 77.42 శాతం అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో మళ్లీ బాలికలే పైచేయి సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 157 మార్కులతో అనిరుధ్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్‌ని సాధించినట్లు మంత్రి గంటా తెలిపారు. ఇక 156 మార్కులతో అచ్యుత్ రెడ్డి రెండో ర్యాంకు, 156 మార్కులతో ర్యాంక్ జ్యోతి మూడవ ర్యాంకు లభించింది.

155 మార్కులతో సందీప్ కుమార్‌కు నాల్గవ ర్యాంకు, 155 మార్కులతో ఆహ్వాన రెడ్డికి ఐదో ర్యాంకు లభించింది. ఇక మెడిసిన్ విభాగానికి వస్తే మొత్తం 89.89 శాతం అర్హత సాధించారు. మూడు, నాలుగు రోజుల్లో వైద్య విద్య కౌన్సెలింగ్‌ తేదీలు ప్రకటిస్తామని ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌, కాకినాడ ఎంపీ తోట నర్సింహం తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎంసెట్‌కు 1,62,807 మంది విద్యార్థులు హాజరయ్యారు. మెడికల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ విభాగంలో 81, 027 మంది విద్యార్థులు హాజరయ్యారు.

English summary
AP Eamcet results declared by minister Ganta srinivasarao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X