ఏసీబీ కాల్స్ వస్తున్నాయా..? ఏపీ ఉద్యోగులకు సర్కార్ క్లారిటీ..!
ఏపీలో తాజాగా అవినీతిపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ సేవలు అందించాల్సిన ఉద్యోగులు లంచాలు డిమాండ్ చేయడం, ఇవ్వకపోతే పనులు చేయకుండా ప్రజల్ని ఆఫీసులకు తిప్పించుకుంటున్నారు. ఇలాంటి వారిపై ఏసీబీ కొరడా ఝళిపిస్తోంది. పలు చోట్ల ఆపరేషన్స్ నిర్వహిస్తూ రెడ్ హ్యండెడ్ గా అవినీతి చేపల్ని, తిమింగలాల్ని పట్టుకుంటోంది. అదే సమయంలో ఉద్యోగులకు నేరుగా ఏసీబీ నుంచి కాల్స్ వస్తున్నాయి.
ఏసీబీ అధికారుల పేరుతో రాష్ట్రంలో పలువురు ఉద్యోగులకు కాల్స్ రావడం, మీరు అవినీతి చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి, డబ్బులివ్వకపోతే మీపై రైడ్స్ చేసి కేసులు నమోదు చేస్తామంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. పలు చోట్ల ఇలా కాల్స్ రాగానే అధికారులు బెంబేలెత్తిపోయి వారికి డబ్బులు సమర్పించుకున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఇవాళ స్పందించింది.

ఉద్యోగులకు తమ అధికారుల నుంచి కాల్స్ చేస్తున్నట్లు, డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ఏసీబీ నేరుగా స్పందించింది. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ప్రభుత్వ కార్యాలయాలకు, అధికారులకు ఫోన్ చేసి, తాము ఏసీబీ అధికారులుగా నటిస్తూ, ఏసీబీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, తమపై అనేక ఫిర్యాదులు వచ్చాయని బెదిరిస్తున్నట్లు ఏసీబీ ప్రధాన కార్యాలయం దృష్టికి వచ్చిందని తెలిపింది. ఏసీబీ దాడి జరుగుతుందని, దాడిని ఆపడానికి, డబ్బు డిమాండ్ చేస్తున్నారని, దానిని ఒక నిర్దిష్ట మొబైల్ నంబర్కు పంపాలని లేదా దానిని తీసుకోవడానికి వచ్చే వ్యక్తికి నగదుగా ఇవ్వాలని వారు కోరుతున్నట్లు తెలిపింది.

మరికొన్ని సందర్భాల్లో, ఈ వ్యక్తులు తమపై ఏసీబీ కేసు నమోదు అయిందని, అరెస్టును నివారించడానికి, వారు అడిగిన మొత్తాన్ని చెల్లించాలని అధికారులను బెదిరిస్తున్నారని పేర్కొంది. అవినీతి నిరోధక బ్యూరోలోని ఏ అధికారి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి ఫోన్ కాల్స్ చేయరని లేదా డబ్బు డిమాండ్ చేయరని ఏసీబీ ప్రధాన కార్యాలయం తెలిపింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇలాంటి నకిలీ కాల్స్ పట్ల అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఎవరికైనా ఇలాంటి బెదిరింపు లేదా మోసపూరిత కాల్స్ వస్తే, వారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా ఏసీబీ టోల్-ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని కోరుతోంది.
-
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు! -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వారికి 6వేల జీతం పెంపు! -
Raisina Dialogue 2026: అప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు-చంద్రబాబు కామెంట్స్..! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్












Click it and Unblock the Notifications